భారతీయ న్యాయవాది From Wikipedia, the free encyclopedia
మన్మోహన్ సింగ్ లిబర్హాన్, (11 నవంబర్ 1938) భారతీయ న్యాయవాది. 1998-2000 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఒక నివేదికను తయారు చేసిన లిబర్హాన్ అయోధ్య కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి 17 సంవత్సరాలపాటు నాయకత్వం వహించాడు.[1][2]
మన్మోహన్ సింగ్ లిబర్హాన్ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | |
అంతకు ముందు వారు | ఉమేష్ చంద్ర బెనర్జీ |
తరువాత వారు | సత్యవ్రతా సిన్హా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 11 నవంబరు 1938 |
ఉత్తర భారత రాష్ట్రమైన హర్యానాకు మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అడ్వకేట్ జనరల్ గా పనిచేశాడు. అనతికాలంలోనే పంజాబ్, హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎదిగాడు. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు లిబర్హాన్ అయోధ్య విచారణ కమిషన్ చైర్మన్గా నియమించారు 1992 డిసెంబరు 6న అయోధ్యలో జరిగిన సంఘటనలు "ఆకస్మికమైనవి లేదా ప్రణాళిక లేనివి" అని కమిషన్ తేల్చింది.[1]
కొంతకాలం తరువాత లిబర్హాన్ను మద్రాస్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, పదవీ విరమణ చేసే వరకు అందులో పనిచేశాడు.
2009 వరకు లిబర్హాన్ కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగాడు.
ప్రస్తుతం భారతదేశంలోని చండీగఢ్ లో నివసిస్తున్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.