బైరెడ్డి రాజశేఖరరెడ్డి

From Wikipedia, the free encyclopedia

బైరెడ్డి రాజశేఖర రెడ్డి భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త, రాయలసీమ వాది, రాయలసీమ ప్రాంత శ్రేయోభిలాషి. తెలంగాణ విభజనవాదం సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తే "రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం"గా ఏర్పాటు చేయాలన్న వాదనని తీసుకువచ్చిన నేత. రాయలసీమతో కలిపిన తెలంగాణకి గానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన తెలంగాణకి గానీ (రెండింటినీ రాయల తెలంగాణ గానే వ్యవహరించాడు) ఇతను వ్యతిరేకించాడు. "ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం" కోసం రాయలసీమ నాలుగు జిల్లాలు తిరిగి, యువత, రైతాంగాన్ని చైతన్య పరిచిన నేత. గతంలో రెండు పర్యాయాలు నందికొట్కూరు నియోజక వర్గం నుంచి శాసనసభ కు ప్రాతినిధ్యం వహించారు.

త్వరిత వాస్తవాలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, జననం ...
బైరెడ్డి రాజశేఖరరెడ్డి
జననం1957
కర్నూలు జిల్లా కి చెందిన ముచ్చుమర్రి, పగిడ్యాల మండలం
ప్రసిద్ధిరాజకీయ నాయకుడు
తండ్రిబైరెడ్డి శేషశయనారెడ్డి [1]
మూసివేయి

వ్యక్తిగత జీవితం

కర్నూలు జిల్లాకి చెందిన పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలో 1957 లో మూడు పర్యాయములు ఎం ఎల్ ఏ అయిన బైరెడ్డి శేషశయన రెడ్డికి ఇచను జన్మించాడు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేశారు.

వృత్తి

నందికొట్కూరు నియోజక వర్గానికి 1994 నుండి 1999 వరకు తెలుగు దేశం పార్టీ తరపున ఎం ఎల్ ఏ గా ఉన్నారు. 2004, 2009 లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమి చెందాడు.

రాయలసీమ పరిరక్షణ సమితి

సెప్టెంబరు 2012 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీ ఎస్) స్థాపించారు. రాయలసీమ వాసుల సమస్యలని జనం దృష్టికి తీసుకురావటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 3000 కి.మీ రాయలసీమ ప్రాంతంలో ట్రాక్టరు యాత్రని నాలుగు నెలల వరకు చేశారు.2013 ఆగస్టు 5 న రాయలసీమ పరిరక్షణ సమితి నే తన పార్టీ పేరుగా ప్రకటించారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.