From Wikipedia, the free encyclopedia
పురానపూల్ కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఇదీ ఒకటి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
పురానపూల్ | |
---|---|
నిర్దేశాంకాలు | 17°22′03″N 78°27′30″E |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | పాదచారులు |
దేనిపై ఉంది | మూసీ నది |
స్థలం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
లక్షణాలు | |
మొత్తం పొడవు | 600 ft |
వెడల్పు | 35 ft |
చరిత్ర | |
Inaugurated | 1578 CE |
ప్రదేశం | |
ఈ వంతెన సా.శ.1578లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వన్ వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జీని నిర్మించారు. మరో కథనం ప్రకారంగా సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా భార్య భాగమతితో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెను క్రమం తప్పకుండా కలవడానికి పురానపూల్ నిర్మించాడు. ఆ తరువాత వివాహం చేసుకున్నాడు.
ఈ పూల్ నిర్మాణంలో 22 అర్చ్ లు ఉన్నాయి. ఎత్తు 54 అడుగులు, పొడవు 600 ఫీట్లు, వెడల్పు35 చదరపు అడుగులు.
ఈ కట్టడాన్ని ఎంతోమంది విదేశీయాత్రికులు సందర్శించారు. అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్ సందర్శించిన ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ పురానాపూల్ నిర్మాణ శైలికి ముగ్ధుడైనాడు. దీన్ని పారిస్ లోని పోంట్ న్యుఫ్ తో పోల్చాడు.
400 ఏళ్లనాటి ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1820లో కొద్దిగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మతులు చేయిపించాడు. ఆ తర్వాత 1908లో మూసి నది వరదల తర్వాత దెబ్బతిన్న కొద్దిబాగాన్ని మరమ్మతు చేశారు.
దీనికి సమీపంలో మియా మిష్క్ మసీదు ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.