From Wikipedia, the free encyclopedia
పదనాథ మహమ్మద్ సయీద్ (10 మే 1941 - 18 డిసెంబర్ 2005) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లక్షద్వీప్ లోక్సభ నియోజకవర్గం నుండి 1967 నుండి 2004 వరకు వరుసగా పది సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై[1] 22 మే 2004 నుండి 18 డిసెంబర్ 2005 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
పదనాథ మహమ్మద్ సయీద్ | |||
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 22 మే 2004 – 18 డిసెంబర్ 2005 | |||
ముందు | అనంత్ గీతే | ||
---|---|---|---|
తరువాత | సుశీల్ కుమార్ షిండే | ||
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
పదవీ కాలం 1967 – 2004 | |||
తరువాత | డాక్టర్ పి. పూకున్హి కోయా | ||
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఆండ్రోట్ ద్వీపం, లక్షద్వీప్ , బ్రిటిష్ ఇండియా | 1941 మే 10||
మరణం | 2005 డిసెంబరు 18 64) సియోల్, దక్షిణ కొరియా | (వయసు||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఏ.బి. రహ్మత్ సయీద్ | ||
సంతానం | ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ | ||
నివాసం | లక్షద్వీప్ | ||
మూలం | TOI obituary |
పీఎం సయీద్ లక్షద్వీప్లోని ఆండ్రోట్ ద్వీపంలో మే 10, 1941న జన్మించాడు. ఆయన మంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బికామ్, ముంబైలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రం పూర్తి చేశాడు.
ఆయన కుమారుడు ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ పూణేలోని ఇండియన్ సొసైటీ కళాశాల నుండి లా గ్రాడ్యుయేట్, 26 సంవత్సరాల వయస్సులో లక్షద్వీప్ నియోజకవర్గం నుండి ఎన్నికై 15వ లోక్సభలో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించాడు.[3]
సయీద్ కాలేయం పెరగడం & ప్రాణాంతక లక్షణాలతో వైద్య చికిత్స కోసం దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని హ్యుందాయ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 2005 డిసెంబర్ 19న గుండెపోటుతో మరణించాడు. అతనికి భార్య ఎబి రహమత్ సయీద్, ఒక కుమారుడు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు.[5][6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.