From Wikipedia, the free encyclopedia
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి శానససభ్యుడిగా ఉన్నాడు.[1][2] శాసన మండలి సభ్యుడిగా, భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.[3]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | |||
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | |||
పదవీ కాలం 2018 - 2022 ఆగస్టు 2 | |||
నియోజకవర్గం | మునుగోడు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
తెలంగాణ శాసన మండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2016-2018 | |||
పదవీ కాలం 2009 - 2014 | |||
తరువాత | బూర నర్సయ్య గౌడ్ | ||
నియోజకవర్గం | భువనగిరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | బ్రాహ్మణవెల్లెంల, నల్లగొండ జిల్లా, తెలంగాణ | 1967 జూన్ 1||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పాపిరెడ్డి - సుశీలమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ | ||
సంతానం | ఒక కుమారుడు | ||
వెబ్సైటు | www.krgreddy.com |
రాజగోపాల్ రెడ్డి 1967, జూన్ 1న పాపిరెడ్డి - సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో జన్మించాడు.[4] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోక్సభ ఎంపిగా ఉన్నాడు.
రాజగోపాల్ రెడ్డికి 1994, ఆగస్టు 20న లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆ సమయంలోనే అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలు నిర్వహించాడు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] ఆయన 2022 ఆగస్టు 2న కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[7]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8] ఆయన ఆ తరువాత 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోయాడు.[9] రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 2023 జూలై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది.[10] రాజగోపాల్రెడ్డి 2023 అక్టోబరు 25న బీజేపీకి రాజీనామా చేశాడు.[11][12]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2023 అక్టోబరు 27న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[13] ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది.[14][15] ఆయన ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 2024 మార్చి 31న భువనగిరి లోక్సభ ఇన్చార్జ్గా నియమితుడయ్యాడు.[16]
చైనా, ఈజిప్ట్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేసియా, శ్రీలంక, సింగపూర్, యు.ఎస్.ఏ. మొదలైన దేశాలు సందర్శించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.