From Wikipedia, the free encyclopedia
ఎగ్గే మల్లేషం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[2][3] ఆయన 2024 జులై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5][6]
ఎగ్గే మల్లేషం | |||
ఎమ్మెల్సీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మార్చి 30 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | నాగోల్, ఉప్పల్ మండలం, హైదరాబాదు, తెలంగాణ | 1956 మే 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు, రాజమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ స్వరూప | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
మల్లేషం 1956, మే 5న రాములు, రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోల్ జన్మించాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసి వ్యవసాయరంగంలో పనిచేశాడు.[7]ఆయన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[8]
మల్లేషంకు లక్ష్మీ స్వరూపతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
1981లో నాగోల్ గ్రామ పంచాయితీ మెంబరుగా పనిచేశాడు. 2019, మార్చి 30న టిఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.