ఆదోని కోట
From Wikipedia, the free encyclopedia
ఆదోని కోట ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట.[1] ఇది సుమారు 3000 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపుర సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, చివరికి ఆంగ్లేయుల చేతుల్లోకి మారుతూ వచ్చింది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చరిత్ర
ఈ ప్రాంతం ద్వాపరయుగంలో యదువంశ మూలపురుషుడు యయాతి-దేవమానిల (శుక్రాచార్యుల) పుత్రిక యదు పేరుతో యదుపురం యాదవ అవనిగా పిలువబడింది. తదనంతరం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు పరిపాలించారు. దీనిని క్రీ.పూ 1200 శతాబ్దంలో చంద్రసేనుడు అనే రాజు కట్టించినట్లుగా తెలుస్తోంది. దీనిని యాదవగిరి అనే పేరుతో నిర్మించారు.[2] తరువాత మధ్యయుగంలో విజయనగర రాజుల చేతికి వచ్చి సా.శ. 14 నుంచి 16 వ శతాబ్దం మధ్యలో బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. వారి తరువాత ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ, బీజాపూర్ సుల్తానులకు గట్టి కోటగా వ్యవహరించింది. 1690 లో దీన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. 18 శతాబ్దం చివరి నాటికి మైసూరు రాజుల చేతికి, 1785లో టిప్పు సుల్తాన్ చేతికి, [3] చివరికి 1799 లో ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది.[4]
నిర్మాణం
యాదవగిరి 800 నుండి 900 అడుగుల ఎత్తు వుండి 48 నుంచి 50 కిలోమీటర్ల చుట్టు కొలతలో కోటనిర్మాణమై మొదట 7 వృత్తాల కోటగోడలు వుండి బారాకిల్లా అనే పేరుతో 12 కోటలున్నాయి. శతృవులు చొరబడలేని విధంగా చక్రవ్యూహంగా కనబడేది. కోట వైశాల్యం 3583 ఎకరాలు, కోటగోడల మందం25 నుండి 35 అడుగుల మందం ఉండేది.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.