అశోక స్తంభం

From Wikipedia, the free encyclopedia

అశోక స్తంభం

అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.

Thumb
వైశాలి లోని అశోకుని స్తంభం.

చరిత్ర

చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

Thumb
ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు ఉన్నాయి.

ఈ స్తంభంలో, కలువ పువ్వు (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు ఏనుగు, ఎద్దు, గుర్రం, సింహం గలవు.

ఏక సింహ రాజధాని

Thumb
వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.

ఈ ఏకసింహ రాజధాని వైశాలిలో గలదు.

నోట్స్

ఇవీ చూడండి

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.