2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల నుండి ప్రతినిధులను ఎన్నుకోవడానికి 6 ఏప్రిల్ 2021న పదహారవ తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) దశాబ్దాల పాలనకు ముగింపు పలికి ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) విజయం సాధించింది. డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు ఎనిమిదవ ముఖ్యమంత్రి అయ్యాడు. 1956 పునర్వ్యవస్థీకరణ తరువాత అతను 12వ ముఖ్యమంత్రి. అన్నాడీఎంకేకు చెందిన ఎడప్పాడి కె. పళనిస్వామి స్థానంలో ఆయన నియమితులయ్యారు.
| ||||||||||||||||||||||||||||||||||||||||
← తమిళనాడు 15 వ శాసనసభ తమిళనాడు 16 వ శాసనసభ → | ||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 73.63% ( 1.18%)[1] | |||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
ఫలితాల మ్యాప్ | ||||||||||||||||||||||||||||||||||||||||
|
తమిళనాడు రాష్ట్ర ఆధునిక చరిత్రలో ఇద్దరు ప్రముఖ ముఖ్యమంత్రులైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జె. జయలలిత, డీఎంకే అధ్యక్షుడు ఎం. కరుణానిధి మరణానంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించడంతో జయలలిత ముఖ్యమంత్రి అయ్యి దాదాపు ఆరు నెలల పాటు పనిచేసింది. ఆమె మరణం తర్వాత, O. పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 2017లో పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసి, 15వ అసెంబ్లీ పదవీకాలం ముగిసే వరకు పనిచేసాడు. భారత ఎన్నికల సంఘం 2021 ఫిబ్రవరి 26న 16వ తమిళనాడు శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
DMK తన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA)ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, అనేక ఇతర పార్టీలతో కొనసాగించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ను పేర్కొంది. ఎఐఎడిఎంకె పళనిసామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారత కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)లో చేరింది. COVID-19 మార్గదర్శకాల ప్రకారం 2021 ఏప్రిల్ 6 న పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో 73.63% ఓటింగ్ నమోదైంది. ఎన్నికలకు ముందు, తర్వాత సర్వేలు స్టాలిన్ నేతృత్వంలోని ఎస్పీఏ భారీ మెజార్టీతో గెలుస్తుందని అంచనా వేసింది. మే 2 న వోట్ల లెక్కింపు జరిగింది. SPA 159 స్థానాలను కైవసం చేసుకుంది, డీఎంకే ఒంటరిగా 133 నియోజకవర్గాలలో విజయం సాధించి, 25 సంవత్సరాలలో మొదటిసారిగా సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, అందులో 66 ఏఐఏడీఎంకే గెలుచుకుంది. DMK ఆరవసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది; స్టాలిన్, ఆయన మంత్రుల మండలి మే 7 న ప్రమాణ స్వీకారం చేశారు.