2019 బాలాకోట్ వైమానిక దాడి
From Wikipedia, the free encyclopedia
ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి, పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్ పట్టణానికి సమీపంలో బాంబులు వేసాయి. ఇదే 2019 బాలకోట్ వైమానిక దాడి.
| ||||||||||||||||||||||||||||||
ఫిబ్రవరి 26 ఉదయాన, పాకిస్తాన్ మిలిటరీ ఈ వైమానిక దాడి జరిగినట్లు ప్రకటించింది. భారత విమానాలు తమ పేలోడ్ను బాలకోట్ సమీపంలో జనావాసాలు లేని కొండ ప్రాంతంలో వేసినట్లు ఆ ప్రకటనలో చెప్పింది. ఆ తరువాత అదే రోజున, వైమానిక దాడిని ధ్రువీకరించిన భారతదేశం, ఇదొక ఉగ్రవాద శిక్షణా శిబిరం లక్ష్యంగా చేసిన ముందస్తు దాడి అని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారనీ పేర్కొంది.[4] మరుసటి రోజు, ఫిబ్రవరి 27 న పాకిస్తాన్, భారత్పై వైమానిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. దాని పైలట్, అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది. మార్చి 1 న అతన్ని విడిచిపెట్టింది.
అట్లాంటిక్ కౌన్సిల్ కు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్స్ లాబొరేటరీ, శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ప్లానెట్ ల్యాబ్స్, యూరోపియన్ స్పేస్ ఇమేజింగ్, ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ మొదలైనవారు ఓపెన్ సోర్స్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలు చేసి, బాలకోట్ పరిసరాల్లోని జాబా కొండపై గల స్థలంలో ప్రముఖమైన లక్ష్యాలను భారత్ కొట్టలేదని చెప్పాయి.
2019 ఏప్రిల్ 10 న, దాడులు జరిగిన 47 రోజుల తరువాత, పాకిస్తాన్ ప్రభుత్వపు పటిష్ఠమైన నిఘాలో కొందరు అంతర్జాతీయ పాత్రికేయులు జరిపిన యాత్రలో జాబా కొండపై నిలిచి ఉన్న పెద్ద భవనం కనిపించింది.
1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం తరువాత, వైమానిక దాడులు జరగడం, ఇరు దేశాల యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఇరుదేశాలూ అణు శక్తులుగా మారాయి. [lower-alpha 1]