1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
1983 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
1983 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని 294 నియోజకవర్గాలలో 1983 జనవరిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో గెలిచి, భారీ మెజారిటీ సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెసు పార్టీ 60 సీట్లు మాత్రమే సాధించింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉండగా, జనవరి లోనే ఎన్నికలు జరిగాయి. 1983 జనవరి 9 న పది మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు డిప్యూటీ మంత్రులతో ఎన్టీరామారావు రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా, మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
త్వరిత వాస్తవాలు Party, Percentage ...
![]() | ||||||||||
| ||||||||||
|
మూసివేయి