హరప్పా
From Wikipedia, the free encyclopedia
హరప్పా (ఆంగ్లం :Harappa) (ఉర్దూ: ہڑپہ, హిందీ: हड़प्पा), పాకిస్తాను పంజాబుకు ఈశాన్యాన సాహివాలు పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన నగరం. నవీన పట్టణం రావీ నది దగ్గరలో ఉంది. ఈ పట్టణంలో ప్రాచీన కోట ఉంది. ఇందులో సింధు లోయ నాగరికత లోని హెచి ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది. ప్రస్తుత హరప్ప గ్రామం పురాతన ప్రదేశం నుండి 1 కిమీ (0.62 మైళ్ళు) కన్నా తక్కువ. ఆధునిక హరప్పాలో బ్రిటిషు రాజు కాలం నుండి లెగసీ రైల్వే స్టేషను ఉన్నప్పటికీ ఇది ఈ రోజు 15,000 మంది జనాభా కలిగిన చిన్న క్రాస్రోడ్సు కలిగిన పట్టణం.
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్, పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.[1]
పురాతన నగరం ప్రదేశం సింధు, పంజాబు కేంద్రీకృతమై ఉన్న సింధు లోయ నాగరికతలో భాగమైన కంచుయుగం కోటనగరం శిథిలాలను, శ్మశానవాటిక హెచ్ సంస్కృతి కలిగి ఉంది.[2] పరిపక్వ హరప్పను దశలో (క్రీ.పూ. 2600 - క్రీ.పూ. 1900) ఈ నగరం 23,500 మంది నివాసితులను కలిగి ఉందని, 150 హెక్టార్ల (370 ఎకరాలు) మట్టి ఇటుక ఇళ్లను కలిగి ఉందని విశ్వసిస్తారు. ఇది ఆ కాలానికి పెద్దదిగా పరిగణించబడుతుంది.[3][4] ఇంతకుముందు తెలియని నాగరికతకు దాని మొదటి తవ్విన ప్రదేశం ద్వారా పేరు పెట్టే పురావస్తు పరిశోధకులు సింధు లోయ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు.
లాహోరు-ముల్తాను రైల్వే నిర్మాణంలో బయటపడిన శిథిలాల నుండి ఇటుకలను ట్రాకు బ్యాలస్టుగా ఉపయోగించిన కారణంగా పురాతన నగరం హరప్ప బ్రిటిషు పాలనలో భారీగా దెబ్బతింది. 2005 లో భవన నిర్మాణ పనుల ప్రారంభ దశలో బిల్డర్లు అనేక పురావస్తు కళాఖండాలను కనుగొన్న కారణంగా ఈ స్థలంలో వివాదాస్పద అమ్యూజుమెంటు పార్కు పథకం వదిలివేయబడింది.[5] పాకిస్తాను పురావస్తు శాస్త్రవేత్త మోహితు ప్రేం కుమారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఈ స్థలం పునరుద్ధరించబడింది.