స్కైలాబ్
From Wikipedia, the free encyclopedia
స్కైలాబ్ (ఆంగ్లం:Skylab) అమెరికా వారి అంతరిక్ష కేంద్రం. అంతరిక్షంలో 24 వారాల పాటు పనిచేసిన తరువాత, కక్ష్య క్షీణించి భూవాతావరణంలోకి ప్రవేశించి విచ్ఛిన్నమై పోయింది. ఈ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు వ్యోమగాముల బృందం పనిచేసేవారు. స్కైల్యాబ్ భూమిపై పడి నాశనమయ్యే లోపు అలాంటి బృందాలు మూడు పనిచేసాయి. చివరి బృందం 1974 ఫిబ్రవరి 8 న భూమికి తిగి వచ్చేసింది.[1] ఆ తరువాత తలపెట్టిన 4 వ బృందపు యాత్రను రద్దు చేసారు. 1979 జూలై 11 న స్కైల్యాబ్ భూవాతావరణం లోకి ప్రవేశించి విచ్ఛిన్నమై పోయింది. దాని శకలాలు హిందూ మహా సముద్రం లోను, పశ్చిమా ఆస్ట్రేలియా లోనూ పడ్డాయి.
స్కైలాబ్ దాని బయలుదేరే తుది సిబ్బంది ఛాయాచిత్రాలు తీసినవి (స్కైలాబ్ 4) | ||
స్కైలాబ్ program insignia | ||
కేంద్ర గణాంకాలు | ||
---|---|---|
COSPAR ID | 1973-027A | |
Call sign | స్కైలాబ్ | |
Crew | 3 per mission (9 total) | |
Launch | మే 14, 1973 17:30:00 Coordinated Universal Time | |
వాహక నౌక | Saturn V | |
లాంచి ప్యాడ్ | కెన్నెడీ అంతరిక్ష కేంద్రం 39 | |
వాతావరణ పునఃప్రవేశం | జులై 11, 1979 16:37:00 UTC ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో | |
వెడల్పు | 55.8 feet (17.0 m) w/ one solar panel | |
ఎత్తు | 36.3 feet (11.1 m) w/ telescope mount | |
వ్యాసం | 21.67 feet (6.6 m) | |
పీడనం ఉండే పరిమాణం | 12,417 cu ft (351.6 m3) | |
కక్ష్య ఇంక్లినేషన్ | 50° | |
కక్ష్యా కాలం | 93.4 నిమిషాలు | |
రోజుకు భ్రమణాలు | 15.4 | |
కక్ష్యలో ఉన్న రోజులు | 2,249 | |
మానవ నివాస కాలం | 171 | |
మొత్తం భ్రమణాలు | 34,981 | |
ప్రయాణించిన దూరం | ~890,000,000 mi (1,400,000,000 km) | |
Statistics as of తిరిగి- ప్రయోగం జులై 11, 1979 | ||
కాన్ఫిగరేషన్ | ||
స్కైలాబ్ తెలుగు ప్రజలను మూడు వారాలు భయపెట్టిన ఓ ఉపగ్రహం పేరు. (నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్... )
నియంత్రణ కోల్పోయి గతి తప్పడం
అంతరిక్ష పరిశోధక నౌక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని రూపొందించింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టిన దీని జీవిత కాలం ఏడేళ్లే. అయితే ఆ తర్వాత దీన్ని భూమి మీదకు ఎలా తీసుకురావాలన్న విషయంలో నాసా సరిగా వ్యవహరించలేదు. ఈ లోపే ల్యాబ్ కాస్తా గతి తప్పడం మొదలైంది. ఉపగ్రహా జీవిత కాలం ప్రణాళిక ప్రకారం 1974 లో స్కైల్యాబ్ జీవిత కాలం ముగిసిన తరువాత 8 -10 ఏళ్ళ వరకు కక్ష్యలోనే ఉండాలి. కానీ సౌర కార్యకలాపాలు ఎక్కువ కావడంతో ఉచ్ఛస్థాయిల్లో వాతావరణం పలుచబడి జీవిత కాలం సమయానికంటే ముందే స్కైల్యాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
చనిపోతారన్న ప్రచారం ఎక్కువైంది
స్కైలాబ్ వలన భూమికి భారీ నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందారు, భూమి పై పడితే మహా ప్రళయం సంభవించినట్టేనని భావించిన అనేక మంది ప్రజలు చాలామంది ఇక ఇవే చివరి రోజులని అది నాసా ప్రయోగానికి సంబంధించిన ల్యాబ్ అన్న విషయంపై కొద్ది మందిలోనే ఉంది. చాలా మంది ఆకాశం నుంచి నక్షత్రం లాంటిది భూమిని ఢీకొనబోతోందని, దీంతో ప్రళయం వస్తుందని, మనుషులంతా చనిపోతారన్న ప్రచారం ఎక్కువైంది. అప్పటికే నిపుణులు 1979 జూన్లో దాన్ని సముద్రంలో కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం చాలా మందికి చేరే సరికి కాస్త ఆలస్యం అయింది. స్కైలాబ్ భూమిని ఢీకొంటుందన్న విషయం మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది. . చావు దగ్గరపడిందని భావించి జనంలో విషాదం అలుముకుంది. దీంతో పనీపాట ఆపేసి. . బంధువులను చివరి మాటలు చెప్పుకోవడానికి పిలుచుకున్నారు. శాఖాహారులైతే వీలైనన్ని పిండివంటలు వండుకుని తినడం ప్రారంభించారు. పూటకు తీరొక్క వంటకాలు ఘుమఘుమలాడించారు. ఆడబిడ్డలను ఇళ్లకు పిలిపించుకున్నారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి పండుగ చేసుకున్నారు. ఇక మాంసాహారులైతే ఇంట్లో ఉన్న మేకలు, కోళ్లను మొత్తం వండుకుని తినేశారు. అందుబాటులో ఉన్న మద్యం తాగేసి. . ఒకరిని పట్టుకుని ఒకరు ఏడవడం మొదలు పెట్టారు. అలా మూడు వారాల పాటు ఇలాగే గడిపారు.
తెలంగాణ మొత్తం స్కైలాబ్ బారిన పడుతుందన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. దీంతో చదువుకున్న వారు. . చదువులేని వారు అన్న తేడా లేకుండా ఆందోళనకు గురయ్యారు. తమకున్న కోళ్లు, మేకలను వండుకుని తిన్నారు. పశువులను చాలామంది దాచేశారు. ఇళ్లలో ఉంటే కొంత మేలని ప్రచారం జరగడంతో. . గొర్లను, పశువులను ఇళ్లలో దాచేసుకున్నారు. అన్నీ అమ్ముకుని పండుగ చేసుకున్న జనం... 1979 జూన్లో స్కైలాబ్ దాదాపు మూడు వారాల పాటు అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. జనాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఉపద్రవాల జాబితా రూపొందిస్తే మొదటిదీ అనడంలో అతిశయోక్తి లేదు.
బ్రహ్మం గారి మాటే... పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాల జ్ఞానము, లో చెప్పారనీ స్కైలాబ్ పడుతుందన్నప్పుడు కోటి మంది చస్తారంటూ... ప్రచారం జరిగింది. కలియుగాంతం దగ్గరపడిందని, ఆ విషయాన్ని ప్రతిది తాళపత్రల గ్రంథాలపైన రాయబడిందనీ. ముందే చెప్పారని ఆ ప్రళయం స్కైలాబ్ రూపంలో వచ్చిందంటూ ఊరూరా ప్రచారం జరిగింది. పల్లెల్లో రాత్రి వేళ బ్రహ్మంగారి మాటగా ఆటపాటలతో ప్రచారం చేసిన వారూ ఉన్నారు.
ప్రధాన ప్రసార మాధ్యమం రేడియో
1978 చివరలో స్కైలాబ్ నియంత్రణ కోల్పోయి గతి తప్పడం గుర్తించారు. చివరకు అది వేగంగా వచ్చి భూమిని ఢీకొనడం తప్ప వేరే మార్గం లేదని అంతా భావించారు. అదే విషయాన్ని నాటి ప్రధాన ప్రసార మాధ్యమం అయిన రేడియో తేల్చిచెప్పింది. అంతే ఇది విన్న జనాలు విపరీత భయాందోళనలకు గురయ్యారు. అది కాస్తా అటుఇటుగా భారత భూభాగంలోనే ఢీ కొంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో పత్రికల్లో వెలువడ్డ వార్త మరింత ఆందోళనకు దారితీసింది. తెలంగాణలోని నిజామాబాద్ మొదలు తీరం వరకు ఎక్కడైనా పడే అవకాశం ఉందంటూ ఓ మ్యాప్ ప్రచురితమైంది ఓ పత్రికలో. . అప్పట్లో ఊరూరా పత్రికలు వచ్చేవి కావు. . అయినా ఆ నోటా... ఈ నోటా ఈ వార్త దావనంలా వ్యాపించింది. ఆప్పట్లో ఊరూరికి వార్తా పత్రికలు వచ్చే రోజులు కాదు కాబట్టి. . రేడియో ఉన్న వారిళ్లకు క్యూ కట్టేవారు. . సరిగ్గా వార్తల వేళ ఊరూరు కదిలివచ్చేది. అందులో స్కైలాబ్ గురించి చెబుతారని అందరూ ఎదురుచూసేవారు.
భూవాతావరణంలో ప్రవేశించి విచ్ఛిన్నమై
1979 జూలై 11 న స్కైలాబ్ కానీ సూర్యునిలో జరిగిన మార్పుల వల్ల భూ వాతావరణ పైభాగం అనుకున్న దానికన్నా ఎక్కువగా విస్తరించి, పైకి లేచింది. ఫలితంగా ఈ అంతరిక్ష వాహనంపై వాతావరణ నిరోధకశక్తి, రాపిడి పెరిగి, అంతరిక్ష వాహక కక్ష్యను కిందికి దించాయి. ఫలితంగా అనుకున్న దానికన్నా ముందుగానే జులై 1979లో ఇది భూ వాతావరణంలో ప్రవేశించి, విచ్ఛిన్నమైంది. ఈ సమయంలో విడుదలైన వ్యర్థాలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగించ కుండా దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. దీనిలో కొంతభాగం మాత్రం జనాభా తక్కువగా ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలో వర్షంలా కురిసాయి. జూన్లో శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతంగా సముద్రంలో కూల్చేశారు. కొన్ని శకలాలు మాత్రం భూమిపై పడ్డాయి. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం. భారత్కు ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న అందరూ ఊపిరి పీల్చుకుని ఆపేసిన పనులు మళ్లీ మొదలు పెట్టారు.