From Wikipedia, the free encyclopedia
సై భోసలే (నీ సాయి నింబల్కరు) (మ .1633[1] 5 సెప్టెంబరు 1659) మరాఠా సామ్రాజ్యం స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు మొదటి భార్య, పట్టమహిషి. ఆమె తన భర్త వారసుడైన రెండవ ఛత్రపతి సంభాజీకి తల్లి.
Saibai | |
---|---|
జననం | సుమారు 1633 Phaltan,Satara Maharashtra, India |
మరణం | September 5, 1659 (aged 26) Rajgad Fort, Pune, India |
Spouse | Chatrapati Shivaji Maharaj |
వంశము | Sakhubai Nimbalkar Ranubai Jadhav Ambikabai Mahadik Sambhaji |
House | Nimbalkar (by birth) Bhosale (by marriage) |
తండ్రి | Mudhoji Rao Naik Nimbalkar |
తల్లి | Reubai |
మతం | Hinduism |
సైబాయి ప్రముఖ నింబల్కరు కుటుంబంలో సభ్యురాలు. నింబల్కరు కుటుంబసభ్యులు పవారు రాజవంశం యుగం నుండి ఫల్తాను పాలకులుగా ఉండేవారు. [ఆధారం చూపాలి]దక్కను సుల్తానులు మొఘలు సామ్రాజ్యానికి సేవలందించారు. ఆమె పదిహేనవ ఫల్తాను రాజా కుమార్తె. పదహారవ రాజా ముధోజిరావు, బజాజీ రావు నాయకు నింబల్కరు నాయకు నింబల్కరు సోదరి.[2] సాయిబాయి తల్లి రూబాయి షిర్కే కుటుంబానికి చెందినది. ఆంధ్రప్రదేశుకు చెందిన రావాలీ ప్రస్తుత శివాజీ, సాయిబాయి దంపతుల చివరి కుమార్తె.
సైబాయి, చత్రపతి శివాజీ మహారాజు 1640 మే 16 న పూణేలోని లాలు మహలు వద్ద బాల్యంలోనే వివాహం చేసుకున్నారు.[3][4] ఈ వివాహాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు తల్లి జిజాబాయి ఏర్పాటు చేసింది. కాని స్పష్టంగా చత్రపతి శివాజీ మహారాజు తండ్రి, షాహాజీ లేదా ఆయన సోదరులు సంభాజీ, ఎకోజీలు ఈ వివాహానికి హాజరు కాలేదు. ఆ విధంగా షాహాజీ త్వరలోనే తన కొత్త కోడలు, శివాజీ, ఆయన తల్లి జిజాబాయిలను బెంగళూరుకు పిలిచాడు. అక్కడ ఆయన తన రెండవ భార్య తుకాబాయితో నివసించేవాడు.[5]
సైబాయి, శివాజీ ఒకరితో ఒకరు సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారు. ఆమె తెలివైన మహిళ, శివాజీకి నమ్మకమైన భార్య అని చెప్పబడింది.[6] అన్ని సాక్ష్యాల ఆధారంగా సాయిబాయి ఒక అందమైన, మంచి స్వభావం గల, ప్రేమగల మహిళ. ఆమె "సున్నితమైన, నిస్వార్థ వ్యక్తి" గా వర్ణించబడింది.[7]అయినప్పటికీ ఆమె మనోహరమైన వ్యక్తిగత లక్షణాలన్నీ శివాజీ రెండవ భార్య సోయరాబాయికి విరుద్ధంగా ఉన్నాయి. ఆమె ఒక చమత్కార మహిళ.[8] అయినప్పటికీ సాయిబాయి, శివాజీ ఇతర భార్యల మధ్య ఎటువంటి ఘర్షణ లేదా పరస్పర భేదాల గురించి రికార్డులు లేవు.[9] సాయిబాయి జీవించి ఉన్నంత కాలం, ఆమె శివాజీకి ఆస్తి, రాజ్య వ్యవహారాల గురించి మాత్రమే కాకుండా, గృహ వ్యవహారాల విషయంలో కూడా సహకారం అందించింది. ఆమె తన భర్త, రాజ కుటుంబం మీద కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. శివాజీని బీజాపూరు రాజు మహ్మదు ఆదిలు షా వ్యక్తిగత సమావేశం కొరకు ఆహ్వానించినప్పుడు సైయిబాయి సలహాస్వీకరించినట్లు భావిస్తున్నారు.[10] సైబాయి జీవిత కాలంలో శివాజీ కుటుంబం ఒకే విధమైన వాతావరణాన్ని కలిగి ఉంది. వారిద్దరి మద్య అనుకూల దాంపత్యం ఉండేది. అయినప్పటికీ చాలావరకు రాజకీయ ప్రయోజనాల ఆధారంగా ఆయన వివాహాలు జరిగాయి.[9]
1659 లో సైయిబాయి అకాల మరణం తరువాత 1674 లో జిజాబాయి మరణం సంభవించిన తరువాత శివాజీ వ్యక్తిగత జీవితం ఆందోళన, అసంతృప్తితో నిండిపోయింది.[11] వారి మరణాల తరువాత సోయరాబాయి రాజ గృహంలో ప్రాముఖ్యతను సంపాదించినప్పటికీ ఆమె శివాజీ ఎంతో ప్రేమించిన సాయిబాయి వంటి ప్రేమగల భార్య కాదు. సైబాయి కుమారుడు సంభాజీ పెద్దవాడు. ఆయన తండ్రికి వారసుడు-స్పష్టంగా నిర్ణయించబడినప్పటికీ సోయరాబాయి సొంత కొడుకు రాజారాం వారసత్వ సింహాసనం కోసం నిరంతరం ప్రయత్నించింది. సోయరాబాయి రాజకీయ కుట్రలు శివాజీ జీవితంలో మరింత ఇబ్బందులను కలిగించాయి.[12]
సైబాయి చనిపోయే వరకు శివాజీకి ఇష్టమైనదిగా, ఆయనకు స్ఫూర్తినిచ్చే గొప్ప మూలంగా ఉంది. పురాణకథనాల ఆధారాలుగా శివాజీ తన మరణ సమయంలో పలికిన చివరి పదం "సై" అని భావిస్తున్నారు.[1]
వారి పంతొమ్మిదేళ్ల వివాహం కాలం నాటికి సైబాయి, శివాజీ దంపతులు నలుగురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు: సకవరుబాయి ("సఖుబాయి" అనే మారుపేరు), రానుబాయి, అంబికాబాయి, సంభాజీ. సఖుబాయి తన మొదటి బంధువు, సైబాయి సోదరుడు బజాజీ రావు నాయకు నింబల్కరు కుమారుడు మహాద్జీని వివాహం చేసుకున్నది. బాబాజీ 1657 లో మొఘలు రాజప్రతినిధి ఔరంగజేబు కారణంగా ఇస్లాం మతంలోకి మారినందున బజాజీని తిరిగి హిందూ మతంలోకి తీసుకుని వచ్చి కుటుంబాలను ఏకీకృతం చేయాలనే ఉద్దేశ్యంతో జరిగింది. రానుబాయి జాదవు కుటుంబంలో వివాహం చేసుకున్నది. అంబికాబాయి 1668 లో హర్జీ రాజే మహాదికును వివాహం చేసుకున్నది.[ఆధారం చూపాలి].[13] సైబాయి నాల్గవ సంతానం ఆమె ఏకైక కుమారుడు సంభాజీ. ఆయన 1657 లో జన్మించాడు. శివాజీ పెద్ద కుమారుడైన సంభాజీ శివాజీ వారసుడుగా నిర్ణయించబడ్డాడు. అనేక కారణాలతో సంభాజీ జననం రాజ గృహంలో ఎంతో ఆనందం, ప్రాముఖ్యత కలిగి ఉంది.[14]
సైబాయ్ 1659 లో రాజ్గడ్ కోటలో మరణించింది. శివాజీ ప్రతాప్గడులో అఫ్జలు ఖాను సమావేశానికి జరపడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సంభాజీ జన్మనిచ్చినప్పటి నుండి సై భాయి అనారోగ్యంతో ఉంది. ఆమె మరణానికి ముందు ఆమె అనారోగ్యం తీవ్రస్థాయికి చేరింది. ఆమె విశ్వసించిన ధారావు సంభాజీ సంరక్షణ చూసుకున్నాడు. సంభాజీకి తల్లి చనిపోయేటప్పుడు రెండు సంవత్సరాలు. ఆయన నాయనమ్మ జిజాబాయి చేతిలో పెరిగాడు.[15]సాయిబాయి సమాధి రాజ్గడ్ కోట వద్ద ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.