From Wikipedia, the free encyclopedia
సిద్ధూ మూసేవాలా (1993 జూన్ 11 - 2022 మే 29) (ఆంగ్లం: Sidhu Moose Wala) భారతీయ కళాకారుడు . ప్రముఖ పంజాబీ గాయకుడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేత.
సిద్ధూ మూసేవాలా | |
---|---|
జననం | శుభ్దీప్ సింగ్ సిద్ధూ[1] 1993 జూన్ 11 [2] మూసా, మాన్సా జిల్లా, పంజాబ్, భారతదేశం |
మరణం | 2022 మే 29 28) జవహర్కే, మాన్సా జిల్లా, పంజాబ్, భారతదేశం | (వయసు
మరణ కారణం | తుపాకీతో హత్య |
ఇతర పేర్లు | 5911 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–2022 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంతకం | |
సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్దీప్ సింగ్ సిద్ధూ 2021 డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 ఎన్నికల్లో పంజాబ్లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హింసను ప్రేరేపించే పాటల్తో ఆయన వివాదాస్పద గాయకుడిగా వార్తల్లో నిలిచారు. సిద్ధూ పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్.. వంటి చిత్రాల్లో నటించారు. 2020 జులై నెలలో ఎకే-47 రైఫిల్ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు నమోదైంది.
28 ఏళ్ళ వయసులోనే సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. 2022 మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.