From Wikipedia, the free encyclopedia
సరిత జోషి (సరితే భోస్లే) (జననం 1941 అక్టోబర్ 17 ) ఒక భారతీయ నటి. నాటకాల్లో, టివి కార్యక్రమాల్లో, సినిమాల్లో నటించింది. గుజరాతీ, మరాఠీ నాటకరంగాల్లోనూ, మరాఠీ సినిమాలో ఈమె ప్రముఖ నటి. కళలకు చేసిన కృషికి గాను 2020లో ఆమెకు భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. స్టార్ ప్లస్ లో విజయవంతమైన బా బహూ ఔర్ బేబీలో గోదావరి లాభశంకర్ ఠక్కర్ అలియాస్ బా అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ పాత్రలో నటనకు ఆమె అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె 1970 లలో తన భర్త ప్రవీణ్ జోషితో అనేక గుజరాతీ నాటకాల్లో నటించింది.
సరిత జోషి | |
---|---|
జననం | సరితా భోంస్లే, ఇందు/ఇందుమతి 1941 అక్టోబరు 17 పూణే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1950-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రవీణ్ జోషి |
పిల్లలు | కేత్కి డేవ్ పర్బీ జోషి |
బంధువులు | పద్మారాణి (సోదరి) |
ఆమె 2019లో జీ టీవీ కి చెందిన హమారీ బహు సిల్క్ కార్యక్రమంలో 'ఎ' గ్రేడ్ చిత్రాలను ద్వేషించే, కష్టపడి పనిచేసే వ్యాపార మహిళగా కనిపించింది.
సరిత వడోదరలో పెరిగినప్పటికీ పూణేలోని ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించింది.[1] ఆమె తండ్రి భీమ్ రావ్ భోంస్లే బారిస్టర్, తల్లి కమ్లబాయి రాణే గోవాకు చెందినవారు. ఆమె తన సోదరి పద్మారాణితో కలిసి తొమ్మిదేళ్ల వయసులో వేదికపై నటించడం ప్రారంభించింది. ఆమె సంప్రదాయ నాటకరంగంతో ప్రారంభమైనప్పటికీ, ఆమె త్వరలోనే శాంతా ఆప్టే వంటి మంది కళాకారులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. [1]
జోషి నాటక దర్శకుడు, నాటక రచయిత ప్రవీణ్ జోషిని వివాహం చేసుకున్నారు. [2] ఆమె మేనకోడలు మనసి జోషి రాయ్ (రోహిత్ రాయ్ భార్య), మేనల్లుడు నటుడు శర్మన్ జోషి (ప్రేమ్ చోప్రా అల్లుడు), నాటక ప్రముఖుడు అరవింద్ జోషి కుమారుడు. [3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.