From Wikipedia, the free encyclopedia
సరస్వత బ్రాహ్మణులు హిందూ బ్రాహ్మణులలో (సబ్-గ్రూప్) ఒక శాఖ. సరస్వతి నది యొక్క ఒడ్డున వీరి పూర్వీకులు నివసించినట్లు గుర్తించ బడింది. వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న ఐదు పంచ గౌడ బ్రాహ్మణులలో ఒకటి సరస్వత బ్రాహ్మణులు. [1].
పంచగౌడ, పంచద్రావిడ అని రెండు ప్రధాన బ్రాహ్మణుల శాఖలు; కల్హణుడు యొక్క రాజతరంగిణి నుండి ఈ క్రింద శ్లోకము ప్రకారం ఉన్నాయి.
कर्णाटकाश्च तैलंगा द्राविडा महाराष्ट्रकाः, गुर्जराश्चेति पञ्चैव द्राविडा विन्ध्यदक्षिणे || सारस्वताः कान्यकुब्जा गौडा उत्कलमैथिलाः, पञ्चगौडा इति ख्याता विन्ध्स्योत्तरवासिनः ||
అర్థం: కన్నడిగులు, తెలింగాలు, ద్రావిడులు, మహారాష్ట్రులు, గుజరాతీలు అయిన ఈ ఐదు రకముల వారు (ఎవరయితే) దక్షిణ వింధ్య (పర్వతముల) దగ్గర నివసించే (వారిని) అయిదు ద్రవిడులు అనగా పంచద్రవిడులు (బ్రాహ్మణులు). (అయితే-) సరస్వత బ్రాహ్మణులు, కన్యాకుబ్జ బ్రాహ్మణులు, గౌడ బ్రాహ్మణులు, ఉత్కళ బ్రాహ్మణులు, మైథిలీ బ్రాహ్మణులు వింధ్య (పర్వతాలు) ఉత్తర ప్రాంతమున నివసించే "ఐదు గౌడ" (బ్రాహ్మణులు) లని అంటారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ అన్నిబ్రాహ్మణ శాఖలు యందు పంచగౌడ బ్రాహ్మణులు ప్రధాన భాగంగా ఉన్నారు.
సరస్వత బ్రాహ్మణులు భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో విస్తృతమైన ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. 1947 లో భారతదేశ విభజన తరువాత ఈ సమూహం తీరప్రాంత సింధ్, గుజరాత్ లలో నివసించారు. పంజాబ్, కాశ్మీర్ ముందస్తు విభజనలో 1947 తరువాత పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారిలో ఒక సమూహం కనుగొనబడింది. గౌడ సరస్వతులు అని పిలవబడే ఒక శాఖ ఇప్పుడు భారతదేశ పశ్చిమ తీరం (కొంకణ తీరం అని కూడా పిలుస్తారు) లో కనుగొనబడింది. [2][3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.