సరస్వతి సమ్మాన్
From Wikipedia, the free encyclopedia
[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in మాడ్యూల్:Arguments at line 260: table index is nil.]]
సరస్వతీ సమ్మాన్ | |
---|---|
Date | 1991 |
Location | ఢిల్లీ |
దేశం | భారతదెశం |
Currently held by | కె.శివారెడ్డి |
సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న 22 భారతీయ భాషలలో ఏదైనా ఒక భాషలో కవిత్యంలో ప్రతిభావంతులైన కవులకు అందజేసే వార్షిక పురస్కారం[1][2]. ఈ పురస్కారానికి భారతీయుల విద్యనందించే దేవత సరస్వతి పేరును పెట్టారు. [2]
ఈ పురస్కారాన్ని 1991లో కె.కె.బిర్లా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ అవార్డు కింద పతకం, ప్రశంసాపత్రంతో పాటు రూ.15లక్షల నగదును అందజేస్తారు[3][1][2][4].
ఈ పురస్కారాన్ని గత 10 సంవత్సరాలలో సాహితీ రంగంలో జరిగిన ప్రచురణల నుండి ఒకదానిని పండితులు, మాజీ అవార్డు గ్రహీతలతో కూడిన బృందం ఎంపిక చేస్తుంది. ప్రారంభ అవార్డును నాలుగు సంఫుటాల "క్యా భూలూం క్యా యాద్ కరూ", "నీదాకా నిర్మాణ్ ఫిర్", "బోసెరె సె దూర్", "దర్శ్వర్ సె సోపాన్ తక్" అనే స్వీయ చరిత్రలు రాసినందుకు హరివంశరాయ్ బచ్చన్ కు ప్రదానం చేసారు.[5]