సతి (హిందూ దేవత)
From Wikipedia, the free encyclopedia
సతీదేవి దక్షప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య..ఆష్టాదశశక్తి పీటాలకు ఆది దేవత పరమశివున్ని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంది. ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతుంది. .ధక్షుడు శివునకు వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంబించి దేవతలనందరినీ అహ్వానించి శివున్ని ఆహ్వానించడు.పరమేశ్వరుడు ఆగ్రహం చెంది మౌనంగా ఉంటాడు.సతీదేవి పోవాలని పట్టుబడగా తనను ఒక్కదాన్నే ఆమె పుట్టినింటికి పంపుతాడు.ఎంతో సంతోషంగా పుట్టినింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు.కనీసం పలకరించరు.తండ్రి ఆమెను ధూషిస్తాడు.అవమానం భరించలేక సతీదేవి ఆయజ్ఞంలో ప్రాణత్యాగం చేస్తుంది.ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ధక్షున్ని ఆంతం చేసి సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలు దేరుతాడు శివుని ఆవేధన తీర్చడం కోసం తన చక్రాయిధంతో సతీదేవి శరీరాన్ని పన్నెండు బాగాలుగా ఖండిస్తాడు అ ఖండిత బాగాలు పడిన ప్రధేశాల్లో అమ్మవారు మహాశక్తిగా అవతరించింది. ఆమె పునర్జన్మ పొంది పార్వతిగా మరల శివుని వివాహం చేసుకుంటుంది. సతీదేవి గురించిన తొలి ప్రస్తావనలు రామాయణం, మహాభారత కాలంలో కనిపిస్తాయి. అయితే ఆమె కథకు సంబంధించిన వివరాలు పురాణాలలో కనిపిస్తాయి.[1]
సతి | |
---|---|
శక్తి దేవత, వైవాహికFelicity and Longevity | |
ఇతర పేర్లు | దాక్షాయణి, దాక్షకన్య |
దేవనాగరి | सती |
సంస్కృత అనువాదం | సతి |
అనుబంధం | దేవి, ఆది పరాశక్తి, పార్వతి |
నివాసం | కైలాస పర్వతం |
భర్త / భార్య | శివ |
పిల్లలు | రుద్ర సావర్ణి మను (12వ మనువు, మానవ పురాణం ప్రకారం) |
పాఠ్యగ్రంథాలు | పురాణాలు, కుమారసంభవం, తంత్రం |
తండ్రి | దక్ష |
తల్లి | ప్రసూతి |