![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f9/Tomb_of_Iltutmish%252C_Qutb_Minar_complex%252C_Mehrauli.jpg/640px-Tomb_of_Iltutmish%252C_Qutb_Minar_complex%252C_Mehrauli.jpg&w=640&q=50)
షంసుద్దీన్ అల్తమష్
From Wikipedia, the free encyclopedia
షంసుద్దీన్ అల్తమష్ (Shams-ud-din Iltutmish) (Hindi: अलतामश/AlTaMash/Iltutmish)(Persian شمس الدین التتمش) (r. 1211–1236)బానిస వంశానికి చెందిన ఒక రాజు. టర్కిక్ మూలాలు గలవాడు.[1] ఇతను కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బానిస. తరువాత ఐబక్ ఇతడిని తన అల్లుడిగా చేసుకున్నాడు. బదాయూన్ గవర్నర్ గా నియమింపబడ్డాదు. ఐబక్ సంతానమైన అరం షాహ్ కు బదులుగాఅ 1211 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు రాజధానిని లాహోరు నుండి ఢిల్లీ కి మార్చాడు. మే నెల 1, 1236 వరకు సుల్తానుగా మరణించేతవరకు వున్నాడు. అల్తమష్, ఢిల్లీ సల్తనత్ కాలంలో వెండి "టంకా" నాణేలను, రాగి "జీతాల్" నాణేలను మూల నాణేలుగా ప్రవేశపెట్టాడు. తన సామ్రాజ్యాన్ని "ఇక్తా"లుగా విభజించి "ఇక్తాదారీ" విధానాన్ని ప్రవేశపెట్టాడు, వీటికి అమీరులుగా అధికారులను జీతాలపై నియమించాడు.
షంసుద్దీన్ అల్తమష్ | |||||
---|---|---|---|---|---|
ఢిల్లీ సుల్తాను | |||||
![]() అల్తమష్ సమాధి (మక్బరా) | |||||
పరిపాలన | 1210–1236 | ||||
పూర్వాధికారి | అక్రం షాహ్ | ||||
ఉత్తరాధికారి | రుకునుద్దీన్ ఫిరోజ్ | ||||
మరణం | May 1, 1236 Delhi | ||||
Burial | |||||
Spouses | షాహ్ తుక్రాన్, ఇతరులు | ||||
వంశము | నాసిరుద్దీన్ మహమూద్, రుకునుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, మొయిజుద్దీన్ బహ్రామ్ | ||||
| |||||
రాజవంశం | మమ్లూక్ | ||||
మతం | ఇస్లాం |
ఇతను మెహ్రౌలీ లో 1230 లో హౌజ్ ఎ షంసీ అనే జలాశయాన్ని నిర్మించాడు, అలాగే దీనినానుకును "జహాజ్ మహల్" నిర్మించాడు. 1231లో ఇతడు ఢిల్లీలో తన కుమారుడైన నసీరుద్దీన్ మహ్మూద్ యొక్క "సుల్తాన్ ఘరీ" సమాధిని (ఢిల్లీ లో ఇస్లామీయ శైలిలో గల తొలి సమాధి), తన స్వీయ సమాధిని (కుతుబ్ కాంప్లెక్స్ లో కలదు) నిర్మించాడు.
అంతర్గత కలహాలను అణచివేశాడు, ఢిల్లీ సల్తనత్ ను స్థిరపరచాడు. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తిగావించాడు.