![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Sharadamba_Temple.jpg/640px-Sharadamba_Temple.jpg&w=640&q=50)
శృంగేరి శారదాంబ దేవాలయం
From Wikipedia, the free encyclopedia
శృంగేరి శారదాంబ దేవాలయం (ಶೃಂಗೇರಿ ಶಾರದಾಂಬೆ) భారత దేశము లోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన దైవం శారదాంబ. ఈ శారదాంబ దేవాలయం శృంగేరి (సంస్కృతంలో శృంగ గరి) వద్ద సా.శ. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు చే స్థాపించబడింది. ఈ దేవాలయంలో గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం నిలబడే భంగిమలో ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపింపబడిన ఈ విగ్రహం విజయనగరం రాజుల అధీనంలో ఉండే వరకు ఉండేది. 14 వ శతాబ్దంలో శ్రీ విద్యారణ్యుడు (12వ జగద్గురు) బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
త్వరిత వాస్తవాలు శృంగేరి శారదాంబ దేవాలయం, భౌగోళికాంశాలు: ...
శృంగేరి శారదాంబ దేవాలయం | |
---|---|
![]() | |
భౌగోళికాంశాలు: | 13.418°N 75.252°E / 13.418; 75.252 |
పేరు | |
స్థానిక పేరు: | శృంగేరి శారదాంబ దేవాలయం |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | కర్ణాటక |
ప్రదేశం: | శృంగేరి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శారద (సరస్వతి) |
నిర్మాణ శైలి: | దక్షిణ భారత దేశము, కోవిల్ |
మూసివేయి