విష్ణువర్ధనుడు
From Wikipedia, the free encyclopedia
విష్ణువర్ధనుడు (కన్నడ: ವಿಷ್ಣುವರ್ಧನ) (సా.శ. 1108–1152) హోయసల వంశానికి చెందిన ఒక రాజు. ఈ రాజ్యం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈయన తన అన్న ఒకటవ వీర బల్లాల సా.శ. 1108 లో మరణించిన తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. మొదట్లో జైనమతాన్ని అనుసరించే వాడు. అప్పుడు ఆయనను బిత్తిదేవుడు అని పిలిచేవారు. తరువాత రామానుజాచార్యుల ప్రభావంతో హిందూ మతంలోకి మారి విష్ణువర్ధనుడనే పేరుతో చలామణి అయ్యాడు.[1][2][3][4] విష్ణు వర్ధనుడు దక్షిణ భారతదేశంలో స్వతంత్ర హోయసాల సామ్రాజ్యం స్థాపించడానికి తన చక్రవర్తి, పశ్చిమ చాళుక్య రాజైన నాలుగో విక్రమాదిత్యుడిపైనా, దక్షిణాన ఉన్న చోళ సామ్రాజ్యం పైన అనేక దండయాత్రలు చేశాడు. తలకాడు యుద్ధంలో చోళుల నుంచి గంగావతి (ప్రస్తుతం దక్షిణ కర్ణాటక) లోని కొన్ని ప్రాంతాలను, [5] నోలంబావడి లోని కొన్ని ప్రాంతాలను [6] తన రాజ్యంలో కలుపుకున్నాడు.
విష్ణువర్ధనుడు | |
---|---|
Hoysala King | |
పరిపాలన | సుమారు 1108 – 1152 CE |
పూర్వాధికారి | Veera Ballala I |
ఉత్తరాధికారి | Narasimha I |
రాజవంశం | Hoysala |
మతం | Hinduism (convert from Jainism)[1][2][3][4] |
విష్ణువర్ధనుడి పరిపాలనలోనే హోయసాలుల కన్నడ సాహిత్యం బాగా వ్యాప్తి చెందింది. గణితవేత్తయైన రాజాదిత్యుడు వ్యవహార గణితం, లీలావతి అనే గణిత గ్రంథాలను రచించాడు. ఇ.పి. రైస్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం నాగచంద్ర అనే మహాకవి కన్నడంలో రామాయణం యొక్క విస్తృత రూపమైన రామచంద్ర చరిత పురాణం, జైన తీర్థంకరుడి పై మల్లినాథ పురాణం లాంటి రచనలు చేసినపుడు విష్ణువర్థనుని ఆస్థానంలోనే ఉన్నాడు.[7][8][9][10]