వినుకొండ వల్లభరాయుడు
From Wikipedia, the free encyclopedia
వినుకొండ వల్లభరాయడు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందిన వీధినాటకం క్రీడాభిరామం గ్రంథకర్త. కాకతీయుల కాలంనాటి తెలుగు ఆచార వ్యవహారాలను, పండుగలను, దైవీరూపాలను మొదలుకొని ఎన్నెన్నో విశేషాలతో కూర్చిన గ్రంథం క్రీడాభిరామం. తెలుగు సాహిత్యంలోనే కాక ఆంధ్రుల సంస్కృతి, చరిత్రలను రచించే చారిత్రికులకు కూడా క్రీడాభిరామం ప్రాధాన్యత కలిగిన రచన. అయితే ఈ గ్రంథాన్ని వినుకొండ వల్లభరాయుడు కాక శ్రీనాథుడు రచించాడనే వాదనలు కూడా ఉన్నాయి.