విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
From Wikipedia, the free encyclopedia
విజయనగరము ప్రభలమైన సైనిక శక్తి ఉంది. విజయనగర రాజులకు సామంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచారు. రెండవ దేవ రాయలు (ప్రౌఢ దేవ రాయలు) ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించారు.