అష్టవసువులు
From Wikipedia, the free encyclopedia
అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు.[1] దేవతా గణాలు మూడు రకాలుగా ఉంటాయని పురాణాలలో ఉంది. వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రగణాలు, ద్వాదశ ఆదిత్య గణాలు. వీళ్ళు కాక అశ్వనీదేవతలు ఇద్దరు. మొత్తం 33 మంది. పురణాల ప్రకారం అష్ట వసు గణాలు: అనిలః., అనలః, ఆపః, ధర్మః., ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః. ఇందులో అనిలః అనగా వాయుదేవుడు. అనలః అనగా అగ్నిహోత్రుడు. ఆపః అనగా వరుణదేవుడు. ధర్మః అనగా ధర్మదేవుడు. అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు. వసు అనగా సంపద. అనగా సంపదను అనుగ్రహించెవారు. వీరు వరుసగా దిక్పాలకత్వం కూడా వహించారు.