వత్స
పూర్వ దేశం / From Wikipedia, the free encyclopedia
వత్స కేక వంశ (పాలి, అర్ధమాగధి):వత్స అంటే దూడ[1]) అంగుత్తారా నికాయలో పేర్కొన్న పురాతన భారతదేశంలోని ఉత్తరాపాత సోలాస (పదహారు) మహాజనపదాలలో (గొప్ప రాజ్యాలు) ఒకటి. వాత్స లేదా వంశ దేశం గంగా, యమునా నదుల సంగమం వద్ద ఉత్తరప్రదేశు రాజధాని ప్రాతం (ఆధునిక అలహాబాదు భూభాగం) ఉంది.
త్వరిత వాస్తవాలు Kingdom of Vatsa, రాజధాని ...
Kingdom of Vatsa | |
---|---|
c. 700 BCE–c. 300 BCE | |
Vatsa and other Mahajanapadas in the Post Vedic period. | |
రాజధాని | Kauśāmbī (Allahabad) |
సామాన్య భాషలు | Sanskrit |
మతం | Hinduism Buddhism Jainism |
ప్రభుత్వం | Monarchy |
Maharaja | |
చారిత్రిక కాలం | Bronze Age, Iron Age |
• స్థాపన | c. 700 BCE |
• పతనం | c. 300 BCE |
Today part of | Allahabad division of UttarPradesh, India |
మూసివేయి
ఇది కౌశాంబిని రాజధానిగా చేసుకున్న ఒక రాచరిక పాలిత రాజ్యం. దీని శిధిలాలు అలహాబాదు నుండి 38 మైళ్ళ దూరంలో ఉన్న ఆధునిక గ్రామమైన కోసం వద్ద ఉన్నాయి.[2] క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దంలో బుద్ధుని కాలంలో వత్స పాలకుడుగ ఉదయనా ఉన్నాడు. ఆయన తల్లి మృగవతి భారత చరిత్రలో మొట్టమొదటి మహిళా పాలకురాలిగా గుర్తించబడుతుంది.