వంగరాజ్యం
From Wikipedia, the free encyclopedia
వంగరాజ్యం భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యం, భౌగోళికంగా ఒక రాజకీయ విభాగం. బెంగాలు ప్రాంతం పేరున్న రాజ్యాలలో ఇది ఒకటి.[1] ఇది దక్షిణ బెంగాలులో ఉంది. ప్రస్తుత దక్షిణ పశ్చిమ బెంగాలు (భారతదేశం), నైరుతి బంగ్లాదేశుతో చేరిన ప్రధాన ప్రాంతంలో విస్తరించిన రాజ్యం ఇది. ప్రాచీన భారతదేశం పురాణాలు, కథలలో, శ్రీలంక చరిత్రలో వంగ లక్షణాలు పేర్కొనబడ్డాయి.
Vanga | |
---|---|
Vanga and erstwhile neighbors in ancient India | |
ప్రభుత్వం | Monarchy |
చారిత్రిక కాలం | Ancient India |
Today part of | Bangladesh India |
అనేకమంది గ్రీకో-రోమను రచయితలు పేర్కొన్న గంగారిడై సామ్రాజ్యానికి వంగప్రాంతం బహుశా కేంద్రంగా ఉంది. భారతీయ, గ్రీకో-రోమను రచయితలు ఈ ప్రాంతం, యుద్ధ ఏనుగులను సూచిస్తారు. భారతీయ చరిత్రలో వంగప్రాంతం తన బలమైన నావికాదళానికి ప్రసిద్ది చెందింది. హిందూ ఇతిహాసం మహాభారతంలో వంగప్రాంతం గురించి అనేక సూచనలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని రెండు ప్రధాన సంస్కృత ఇతిహాసాలలో ఒకటి. ఇతర ఇతిహాసం, రామాయణం, రాజ్యాన్ని అయోధ్యకు మిత్రదేశంగా పేర్కొంది. సింహళ వృత్తాంతాల ఆధారంగా వంగ అనేది లంక ద్వీపంలో వలసరాజ్యం. రాజ్యాన్ని స్థాపించిన రాకుమారుడు విజయ పూర్వీకుల నివాసం.