లె కార్బుజియె
From Wikipedia, the free encyclopedia
లె కార్బూజియె(ఆంగ్లం:Le Corbusier)గా ప్రసిద్ధి చెందిన ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్(1887 అక్టోబర్ 6 - 1965 ఆగష్టు 27) స్విట్జర్లాండ్లో జన్మించిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, అర్బన్ ప్లానర్, పెయింటర్, రచయిత. ఇతడు స్విట్జర్లాండ్లో జన్మించి 1930లో ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. ఇతడు 5 దశాబ్దాలపాటు యూరప్, జపాన్, అమెరికా, భారత దేశాలలో పలు భవంతులకు డిజైన్ చేశాడు.
లె కార్బుజియె | |
---|---|
జననం | ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనెరెట్ గ్రిస్[1] (1887-10-06)1887 అక్టోబరు 6 లా షాక్స్ డి ఫాండ్స్, స్విట్జర్లాండ్ |
మరణం | 1965 ఆగస్టు 27(1965-08-27) (వయసు 77) రాక్బ్రూన్ కాప్ మార్టిన్, ఫ్రాన్స్ |
జాతీయత | స్విస్, ఫ్రెంచి |
వృత్తి | ఆర్కిటెక్ట్ |
పురస్కారాలు | ఎ.ఐ.ఎ.గోల్డ్ మెడల్(1961) లెజియన్ ఆఫ్ ఆనర్(1964) |
భవనాలు | విల్లా సావోయ్, పొయిసి విల్లా లా రోచ్, పారిస్, యునైటెడ్ హాబిటేషన్, మార్షల్లీ నార్టె డేమ్ డు హట్, రోన్ఛాంప్ చండీఘడ్లోని భవనాలు |
సంతకం | |
జనసమ్మర్దమైన నగరాలలో ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి ఇతడు అర్బన్ ప్లానింగ్ రంగంలో అంకిత దృష్టితో పనిచేశాడు. ఇతడు ఇంటర్నేషనల్ మాడ్రన్ ఆర్కిటెక్చర్ కాంగ్రెస్ (CIAM)లో వ్యవస్థాపక సభ్యుడు. ఇతడు చండీగఢ్ నగరం మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ నగరంలోని పలు భవంతులకు ఇతడు డిజైన్ చేశాడు.
2016, జూలై 17న యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 17 ఇతడు చేపట్టిన ప్రాజెక్టులు కావడం మాడ్రన్ ఆర్కిటెక్చర్లో ఇతని కృషికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు.[2]