లాల్ బహదూర్ శాస్త్రి
భారతదేశ రెండవ ప్రధాని, కాంగ్రెసు పార్టీ రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
లాల్ బహదూర్ శాస్త్రి ( వినండి (help·info)) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.
గౌరవప్రదమైన లాల్ బహదూర్ శాస్త్రి | |||
పదవీ కాలం 9 జూన్ 1964 – 11 జనవరి 1966 | |||
రాష్ట్రపతి | సర్వేపల్లి రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | గుల్జారీలాల్ నందా(ఆపద్ధర్మ) | ||
తరువాత | గుల్జారీలాల్ నందా(ఆపద్ధర్మ) | ||
భారతదేశ హోం మంత్రి | |||
పదవీ కాలం 9 జూన్ 1964 – 18 జూలై 1964 | |||
ప్రధాన మంత్రి | తానే | ||
ముందు | గుల్జారీలాల్ నందా | ||
తరువాత | సర్దార్ స్వరణ్ సింగ్ | ||
భాతరదేశ హోం మంత్రి | |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 1961 – 29 ఆగస్టు 1963 | |||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
ముందు | గోవింద్ వల్లభ్ పంత్ | ||
తరువాత | గుల్జారీలాల్ నందా | ||
భారతదేశ రైల్వే మంత్రి | |||
పదవీ కాలం 1951 – 1956 | |||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
ముందు | ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ | ||
తరువాత | జగ్జీవన్ రాం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1904-10-02)1904 అక్టోబరు 2 ముఘల్సరాయ్, ఆగ్రా, ఉడ్ ఉమ్మడి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, భారతదేశం) | ||
మరణం | 1966 జనవరి 11(1966-01-11) (వయసు 61) తాష్కెంట్, ఉజ్బెక్ ఎస్.ఎస్.ఆర్, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్) | ||
విశ్రాంతి స్థలం | విజయ్ ఘాట్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | శారదా ప్రసాద్ శ్రీవాస్తవ (తండ్రి) రామ్ దులారీ దేవి (తల్లి) | ||
జీవిత భాగస్వామి | లలితా శాస్త్రి (m. 1928) | ||
పూర్వ విద్యార్థి | గాంధీ కాశీ విద్యా పీఠం | ||
వృత్తి |
| ||
మతం | హిందూ మతం | ||
పురస్కారాలు | భారతరత్న (1966) (మరణానంతరం) |