రుకైయా సుల్తాన్ బేగం
From Wikipedia, the free encyclopedia
మొఘలు చక్రవర్టినిగా 1557 నుండి 1605 వరకు మొదటి భార్యగా " రుకైయా సుల్తాన్ బేగం " మొఘలు చరిత్రలో ప్రాధాన్యత వహించింది.[2] అక్బర్ చక్రవర్తికి పట్టమహిషిగా ఉంది.[3][4][5] రుకైయా సుల్తాన్ బేగం (ప్రత్యామ్నాయ స్పెల్లింగ్: రుక్యాయ, రుకీయ్యా) మూడవ మొఘల్ చక్రవర్తి అక్బర్ యాభై సంవత్సరాల పదవీకాలం వరకు మొఘలు సామ్రాజ్యానికి ఆమె సుదీర్ఘమైన సేవలను అందించింది.[6]
Ruqaiya Sultan Begum | |
---|---|
Shahzadi of the Mughal Empire | |
Empress consort of the Mughal Empire Padshah Begum | |
Tenure | సుమారు 1557 – 1605 |
పూర్వాధికారి | Bega Begum |
ఉత్తరాధికారి | Saliha Banu Begum |
జననం | సుమారు 1542 Kabul, Mughal Empire (modern day Afghanistan) |
మరణం | 1626 జనవరి 19(1626-01-19) (వయసు 83–84)[1] Agra, Mughal Empire (modern day India) |
Burial | Gardens of Babur, Kabul |
Spouse | Akbar |
House | Timurid (by birth) |
తండ్రి | Hindal Mirza |
తల్లి | Sultanam Begum |
మతం | Islam |
రుక్యయ తన భర్తకు మొదట బంధువు, పుట్టినప్పటికి ఒక మొఘలు యువరాణి. ఆమె తండ్రి హిండాల్ మిర్జా, అక్బరు తండ్రి హుమాయును తమ్ముడు. ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో అక్బరుతో నిశ్చితార్ధం 14 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నప్పటికీ. ఆమె వివాహం అంతంతమాత్రంగానే ఉండిపోయింది. తరువాతి కాలంలో రుకైయా అక్బర్ అభిమాన మనవడు ఖుర్రం (భవిష్యత్ చక్రవర్తి షాజహాన్) ను దాదాపు దత్తత తీసుకుని సంరక్షింది. అక్బర్ పట్టమహిషిగా రుకైయా అతనిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. తన భర్త, సవతి కుమారుడు జహంగీర్ మధ్య 16 సంవత్సరాల ప్రారంభంలో తండ్రి-కొడుకు సంబంధం పుల్లనిదిగా విషమించినప్పుడు వారిరువురి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడంలో ఒక కీలక పాత్ర పోషించింది, చివరికి మొఘల్ సింహాసనాన్ని జహంగీరును చేర్చింది.[7] ఆమె దత్తు కుమారుడు, షాజహాన్ ఒక వారసత్వ పోరాటం తర్వాత సింహాసనాన్ని అధిష్టించడానికి కేవలం ఒక సంవత్సరం ముందు మరణించింది.