యోగితా బాలి
From Wikipedia, the free encyclopedia
యోగీతా బాలి (జననం 1952 ఆగస్టు 13) మాజీ భారతీయ బాలీవుడ్ నటి. ఆమె 1970ల చివరలో, 1980ల వరకు చురుకుగా ఉండేది.[2]
త్వరిత వాస్తవాలు యోగీతా బాలి, జననం ...
యోగీతా బాలి | |
---|---|
![]() 2011లో యోగీతా బాలి | |
జననం | (1952-08-13) 1952 ఆగస్టు 13 (వయసు 71) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1971–1989 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 4, మహాక్షయ్ చక్రవర్తి, ఉష్మే చక్రవర్తిలతో సహా |
బంధువులు | గీతా బాలి (అత్త) హేమలత (కోడలు)[1] |
మూసివేయి
సినిమా నటిగానే కాకుండా నిర్మాతగా ప్రసిద్ధిచెందిన ఆమె జమీన్ ఆస్మాన్ (1972), బివి-ఓ-బివి (1981), బీ-షేక్ (1981) వంటి చిత్రాలెన్నో తన కెరీర్ లో ఉన్నాయి. ఆమె 1979లో మిథున్ చక్రవర్తితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమెకు గతంలో కిషోర్ కుమార్తో వివాహమైంది.
యోగితా బాలి 1971లో పర్వాణ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆమె తన కెరీర్లో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, దేవ్ ఆనంద్, సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, రణధీర్ కపూర్, సునీల్ దత్ వంటి ప్రముఖ నటులతో పని చేసింది ,