మొహెంజో-దారో
సింధ్, పాకిస్తాన్ ప్రావిన్స్ లో పురావస్తు ప్రదేశం / From Wikipedia, the free encyclopedia
మొహంజో-దారో (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా చనిపోయినవారి గుట్ట ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం సింధు లోయ నాగరికత లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా, నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.[2] ఈ స్థలం రాపిడి ఒరిపిడుల కారణంగాను, సరైన సంరక్షణ లేకపోవడానా శిథిలమౌతూ ఉంది.[3]
త్వరిత వాస్తవాలు స్థానం, నిర్దేశాంకాలు ...
స్థానం | Larkana District, Sindh, Pakistan |
---|---|
నిర్దేశాంకాలు | 27°19′45″N 68°08′20″E |
రకం | Settlement |
వైశాల్యం | 250 ha (620 acres)[1] |
చరిత్ర | |
స్థాపన తేదీ | 26–25th century BCE |
వదిలేసిన తేదీ | 19th century BCE |
సంస్కృతులు | Indus Valley Civilisation |
UNESCO World Heritage Site | |
Official name | Archaeological Ruins at Moenjodaro |
Criteria | Cultural: ii, iii |
సూచనలు | 138 |
శాసనం | 1980 (4th సెషన్ ) |
ప్రాంతం | 240 ha |
మూసివేయి