మధ్య ప్రదేశ్ చరిత్ర
మధ్య ప్రదేశ్ చరిత్ర / From Wikipedia, the free encyclopedia
భారత రాష్ట్రం మధ్య ప్రదేశ్ చరిత్రను మూడు కాలాలుగా విభజించారు. పురాతన కాలం; ఈ ప్రాంతంలో గోండ్, నందా, మౌర్య, గుప్తసామ్రాజ్యాలు ఆధిపత్యం వహించాయి.
మధ్యయుగ కాలంలో పరామరాలు, చందేలా వంశాలతో సహా రాజపుత్ర వంశాల పెరుగుదల కనిపించింది. తరువాత ఖజురాహో ఆలయాలను నిర్మించటానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో మాళ్వా సుల్తానేటు కూడా పాలించింది. మధ్యప్రదేశులో ఆధునిక కాలం మొఘలు, మరాఠా సామ్రాజ్యాలు, తరువాత బ్రిటిషు సామ్రాజ్యం అభివృద్ధి చెందాయి.
బ్రిటిషు రాచరిక రాష్ట్రాలైన గ్వాలియరు, ఇండోరు, భోపాలు ఆధునిక మధ్యప్రదేశులో ఒక భాగం. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 20 వ శతాబ్దం మధ్యకాలం వరకు బ్రిటిషు పాలన కొనసాగింది. 1956 లో మధ్యప్రదేశు రాష్ట్రం ఏర్పడింది. ఛత్తీసుగఢు 2000 నుండి రాష్ట్రంగా రూపొందించబడింది.