మతిమరపు వ్యాధి
మతిమరపు వ్యాధి లేదా అల్జీమర్స్ ఒక దీర్ఘకాలిక న్యూరోడీజెనరేటివ్ వ్యాధి / From Wikipedia, the free encyclopedia
మతిమరపు వ్యాధి (అల్జీమర్స్) ఒక దీర్ఘకాలిక న్యూరోడీజెనరేటివ్ వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.[1][2] డెమెన్షియా 60 నుంచి 70 శాతం కేసుల్లో దీనివల్లనే సంభవిస్తుంది. ఈ వ్యాధికి ముందు ఎక్కువగా కనిపించే లక్షణం ఇటీవలే జరిగిన సంఘటనలు మరిచిపోవడం (short-term memory). ఈ వ్యాధి ముదిరే కొద్దీ భాషతో వచ్చే సమస్యలు, స్థితిభ్రాంతి (disorientation) (ఎక్కడున్నారో మరిచిపోవడం), ప్రవర్తనలో తేడాలు, స్ఫూర్తి కొరవడటం, దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోవడం, సమస్యాత్మక ప్రవర్తనలు మొదలైనవి. ఈ వ్యాధి ఇంకా ముదిరేకొద్దీ కుటుంబం నుంచి సమాజం నుంచీ దూరం కావడం ప్రారంభిస్తారు. క్రమంగా శరీర కార్యకలాపాలు ఆగిపోయి, మరణం సంభవిస్తుంది.[3] ఈ వ్యాధి ముదిరే కాలంలో పలు వ్యత్యాసాలున్నప్పటికీ, నిర్ధారణ జరిగిన తర్వాత రోగి జీవితకాలం సుమారు మూడు నుంచి తొమ్మిది సంవత్సరాలు.[4][5]
సాధారణంగా 65 ఏళ్ళ పైబడిన వారిలో కనిపించే వ్యాధి ఇది. జ్ఞాపకశక్తి మందగించడం దీని ముఖ్య లక్షణం. దీన్ని అలోయిస్ అల్జీమర్స్ అనే జర్మన్ మానసిక శాస్త్రవేత్త 1906 లో మొట్టమొదటి సారిగా వివరించాడు.
అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకశక్తి, ఇతర ముఖ్యమైన మానసిక విధులు నాశనం చేసే ఒక ప్రగతిశీల వ్యాధి. మొట్టమొదట, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఎవరైనా తేలికపాటి గందరగోళాన్ని గుర్తించడం, కష్టపడటం గమనించవచ్చు. చివరికి, వ్యాధి ఉన్న వారు తమ జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులను మరచిపోతారు. నాటకీయ వ్యక్తిత్వ మార్పులకు గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి చాలా సాధారణమైనది. అల్జీమర్స్ అనేది మేధోపరమైన, సామాజిక నైపుణ్యాల నష్టం. అల్జీమర్స్ వ్యాధిలో, మెదడు కణాలు క్షీణించి చనిపోతాయి, ఇది జ్ఞాపకశక్తి, మానసిక పనితీరులో స్థిరమైన క్షీణతకు కారణమవుతుంది.