![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c0/Mangalagiri_town.jpg/640px-Mangalagiri_town.jpg&w=640&q=50)
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ
From Wikipedia, the free encyclopedia
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంబంధిత మండలాల్లోని మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను, గ్రామాలను పాలించే పట్టణ స్థానిక సంస్థ. ఇది 2021 మార్చి 24న మంగళగిరి , తాడేపల్లి పురపాలక సంఘాలను విలీనం చేయుట ద్వారా ఏర్పడింది.[1] ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 194.41 కిమీ 2 (75.06 చ.మై), 2,53,875 మంది ఓటర్లతో వైశాల్యం పరంగా మహా విశాఖనగరపాలక సంస్థ తర్వాతి స్థానంలో ఉన్న రెండవ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముఖ్యమైన మున్సిపల్ కార్పొరేషన్గా వర్గీకరించబడింది.[2][3] మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్కు నగరమేయర్ నాయకత్వం వహిస్తాడు. దాని పరిపాలన నగర మేయర్, కమీషనర్ చేత నిర్వహించబడుతుంది.