భూదానోద్యమం
భారతదేశంలో స్వచ్ఛంద భూ సంస్కరణ ఉద్యమం / From Wikipedia, the free encyclopedia
భూదానోద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగిన ఒక భూముల పంపకం. దీన్ని గాంధేయవాది అయిన వినోబా భావే 1951 లో ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న పోచంపల్లి గ్రామంలో ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూముల్లేని నిరుపేదలకు పంచి ఇచ్చేందుకు ఒప్పించారు. వినోబా, మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సర్వోదయ, గ్రామ స్వరాజ్యం ఉద్యమాలచే ప్రేరేపితుడై ఈ ఉద్యమం ప్రారంభించాడు.