భారతదేశ వాతావరణం
From Wikipedia, the free encyclopedia
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించడం కష్టతరం చేస్తుంద. కోపెను వాతావరణ వర్గీకరణ ఆధారితంగా భారతదేశ వాతావరణం ఆరు ప్రధాన విభాగాలుగా విభజించబడింది: పశ్చిమప్రాంతంలో శుస్క ఎడారి, ఉత్తరాన హిమానీనదాలు, ఆల్పైను టండ్రా, నైరుతిప్రాంతంలోని ద్వీప భూభాగాల్లో వర్షారణ్యాలకు మద్దతు ఇస్తున్న తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వివిధ రకాల మైక్రోక్లిమేట్లు ఉంటాయి. కొన్ని స్థానిక మార్పులతో నాలుగు వాతావరణ శీతోష్ణస్థితి, అంతర్జాతీయ ప్రమాణాలను దేశం వాతావరణ శాస్త్ర విభాగం అనుసరిస్తుంది. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిలు, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబరు), ఒక పోస్టు-రుతుపవనాలు: కాలం (అక్టోబరు నుండి నవంబరు వరకు).
భారతదేశం భూగోళిక, భూగర్భక స్థితి క్లిష్టమైనవి కీలకమైనవి: వాయువ్యంలో థారు ఎడారి, సాంస్కృతికంగా, ఆర్ధికపరంగా ముఖ్యమైన రుతుపవనాలను ప్రభావితం చేయడానికి ఉత్తరదిశలో హిమాలయాలు ఉపస్థితమై ఉన్నాయి. భూమి ఎత్తైన, అత్యంత భారీ పర్వత శ్రేణి అయిన హిమాలయాలు, మంచుతో నిండిన టిబెట్టు పీఠభూమి, ఉత్తర మధ్య ఆసియా నుండి కటబ్యాడు పవనాలు వీస్తుంటాయి. ఉత్తర భారతదేశంలో అధికభాగం వెచ్చగా ఉండి శీతాకాలంలో చల్లగా ఉంటుంది. అదే ఉష్ణ వాతావరణం వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉంటుంది.
ఉష్ణమండల-ఉష్ణమండల, ఉపఉష్ణమండలాల మధ్య సరిహద్దుగా భావించబడే " ట్రాపిక్ ఆఫ్ కాన్సరు " మధ్య భారతదేశం గుండా వెళుతుంది. దేశం అధిక భాగం ఉష్ణమండలంగా పరిగణించబడుతుంది. ఉష్ణమండలాల మాదిరిగా భారతదేశంలో రుతుపవన, ఇతర వాతావరణ నమూనాలు చాలా అస్థిరంగా ఉంటాయి: ఎపోచల్ కరువు, వరదలు, తుఫానులు, ఇతర సహజ విపత్తులు సంభవిస్తూ లక్షలాది ప్రజలను నిరాశ్రయులను చేయడం, మరణానికి గురిచేయడం చేస్తుంటాయి. దక్షిణాసియాలో వాతావరణ పరిస్థితులు అనూహ్యత, తరచుగా సంభవించడం, తీవ్రతలో మార్పు చెందుతాయని ఒక శాస్త్రీయ అభిప్రాయం ఉంది. కొనసాగుతున్న, భవిష్యత్తు వృక్షసంబంధ మార్పులు, ప్రస్తుత భారతదేశంలోని తూర్పు తీరప్రాంత ప్రాంతాల సముద్ర మట్టం పెరగడం భూగోళ ఊష్ణం అధికరించడానికి కారణమౌతాయని భావిస్తున్నారు. [2]