![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/67/Foreign_and_India_Offices%252C_London%252C_1866_ILN.jpg/640px-Foreign_and_India_Offices%252C_London%252C_1866_ILN.jpg&w=640&q=50)
భారతదేశ కార్యాలయం
లండన్లో బ్రిటిషు భారతదేశ పాలనను పర్యవేక్షించే కార్యాలయం / From Wikipedia, the free encyclopedia
భారతదేశ కార్యాలయం (ఇండియా ఆఫీస్) అనేది 1858లో లండన్లో స్థాపించబడిన బ్రిటిషు ప్రభుత్వ విభాగం. భారతదేశ వైస్రాయి, ప్రావిన్సుల అధికారుల ద్వారా దేశ పరిపాలనను పర్యవేక్షించడానికి దీన్ని ఏర్పాటు చేసారు. ఈ భూభాగాల్లో భారత ఉపఖండంలోని నేటి కాలపు దేశాలతో పాటు యెమెన్, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న ఇతర భూభాగాలు కూడా కలిసి ఉన్నాయి. ఈ విభాగానికి నేత, భారతదేశ వ్యవహారాల మంత్రి. ఇతను బ్రిటిషు మంత్రివర్గ సభ్యుడు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ అధికారికి అధికారిక సలహాదారు. [1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/67/Foreign_and_India_Offices%2C_London%2C_1866_ILN.jpg/320px-Foreign_and_India_Offices%2C_London%2C_1866_ILN.jpg)
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారతదేశ కార్యాలయాన్ని మూసివేసారు. కొత్త దేశంతో యునైటెడ్ కింగ్డమ్ సంబంధాల బాధ్యత కామన్వెల్త్ సంబంధాల కార్యాలయానికి (గతంలో డొమినియన్స్ కార్యాలయం ) బదిలీ చేసారు.