భానుభక్త ఆచార్య
From Wikipedia, the free encyclopedia
నేపాలి భాషను అంధకారం ఆవరించుకున్న కాలంలో, సాహిత్యసృష్టికి ఆభాష అర్హతని పొందని తరుణంలో భానుభక్త అవతరించాడు.ఆతని ఆవరణతో నేపాలీ భాషా సాహిత్యాలను అలముకున్న చీకట్లు పటాపంచలైనాయి. భానుభక్త అవతరణ నేపాలీ జాతికీ, భాషా సాహిత్యాలకూ అపూర్వమైన వెలుగును, జీవాన్నీ, ఉజ్వలమైన ప్రగతినీ ప్రసాదించింది.
This article needs additional citations for verification. (July 2017) |
శ్రీ ఆదికవి భానుభక్త ఆచార్యa | |
---|---|
![]() A portrait of Bhanubhakta Acharya | |
రచయిత మాతృభాషలో అతని పేరు | శ్రీ ఆదికవి భానుభక్త ఆచార్య |
పుట్టిన తేదీ, స్థలం | 1814 (1871 B.S.) చుండి రంగా, నేపాల్ |
మరణం | 1868 (aged 53–54) (1925 విక్రమ సంవత్సరంB.S.) సెటిఘట్ |
వృత్తి | కవి |
భాష | నేపాలి (Khas) |
జాతీయత | నేపాలి |
పౌరసత్వం | నేపాల్ |
భారతదేశంలో వలనే ప్రాచీన నేపాలు దేశంలో కూడా సంస్కృతభాషకే రాజస్థానలలో గౌరవం లభించేది.సంస్కృతభాషా సాహిత్యాలపై అపారమైన అభిమానం వల్లనైతేనేమి, ప్రభువుల ప్రాపకాన్ని సంపాందించడాని కైతేనేమి నాటి నేపాలీ కవి పండితులంతా తమ సాహిత్య సృష్టిని సంస్కృతభాషలోనే చేసేవారు.కాని, ఏఒక్కరూ ప్రాంతీయ భాషలైన మగధి, పర్బాతే, నేవారీ మున్నగు భాషలలో సాహిత్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నించలేదు. ఆకారణంగా ప్రాచీన నేపాలు దేశంలో సాహిత్యసృష్టి అంతా సంస్కృతంలోనే రూపొంది-మహామహానులైన సంస్కృత విద్వత్కవులనూ, అపూర్వమైన సంస్కృత సాహిత్యాన్నీ సాహిత్య ప్రపంచానికి సపర్పించింది. అదే సమయంలో నేపాలీ రాజకీయ పరిణామాలలో పలు విపత్తులు దండయాత్రలు సంభవించాయి. ఇటువంటి విషమ పరిస్థితులలో మహాకవి భానుభక్త అవతరించాడు. మహారాజా పృధ్వీనారాయణ్ షా దేశంలో రాజకీయ సమైక్యతను సాధించినట్లుగా, మహాకవి భానుభక్త ప్రజల భాషలో సాహిత్యాన్ని సృష్టించడం ద్వారా నేపాలీ భాషా సాహిత్యాలలో మహత్తరమైన విప్లవాన్ని సాధించాడు.తద్వారా సాహిత్యాన్ని ప్రజలందరికీ సన్నిహితపరచడమే కాకుండా, విభిన్న భాషా వర్గాల మధ్య భావ సమిక్యతను సాధించాడు. ప్రజల భాషయైన నేపాలీ భాషకు గౌరవాన్ని సంతరింపజేస్తూ, ఆ భాషలో సాహిత్యానికి నాడే బలమైన పునాదులు వేశాడు.