బొజ్జన్నకొండ
From Wikipedia, the free encyclopedia
అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం దగ్గర గల కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జన్నకొండ, లింగాలకొండ. ఇవి విశాఖపట్నం నుండి 45 కి.మీ, అనకాపల్లి నుండి కొద్ది దూరంలో గలవు. ఈ స్థలాలు సా.శ. 4 నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఒకనాడు సంఘారము (సంఘారామము) అని పిలవబడేది. మూడు రకాల బౌద్ధ మత వర్గాలు హీనయాన, మహాయాన, వజ్రయాన బాగా వృద్ధిలో వుండేవి.[1]