బులా చౌదరి
భారతీయ ఈతగత్తె / From Wikipedia, the free encyclopedia
బులా చౌదరి సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ. ఈమె భారతదేశంలో జాతీయ మహిళా ఈత ఛాంపియన్ గా నిలిచారు. ఆమె 1989, 1999లలో "ఇంగ్లీషు ఛానెల్" ను రెండుసార్లు ఈదారు. ఈమెకు 1990లో అర్జున అవార్డు వచ్చింది. ఆమె కోల్కతాలో ఒక స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పడానికి పథకం రచిస్తున్నారు. ఈమె పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నందన్పూర్ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్ట్(మార్క్సిస్టు) తరపున లెజిస్లేచర్గా ఎన్నికైనారు.
ఈమె ప్రతిభావంతురాలైన అధిక దూరాలను ఈదే భారతీయ స్విమ్మర్, ఆమె పోటీ ప్రపంచంలో తన స్థానాన్ని నిలబట్టుకున్నారు. ఆమె తన 9 వయేట ఆమె స్విమ్మింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ పోటీలలో ఆరు బంగారు పతకాలను సాధించారు.[1] ఆమె తన 24వ యేటనుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. 2004లో శ్రీలంక నుండి ధనుష్కోటి వరకు పాక్ జలసంధిని 14 గంటలలో ఈదగలిగారు. ఈమె ఐదు ఖండాలలో ఏడు సముద్రాలను ఈదిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచారు.