![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Bihar_in_India.png/640px-Bihar_in_India.png&w=640&q=50)
బీహార్లో 2004 భారత సార్వత్రిక ఎన్నికలు
బీహార్లో భారత సార్వత్రిక ఎన్నికలు 2004 / From Wikipedia, the free encyclopedia
బీహార్లో ఆర్జేడి నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవి భర్త లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్డీఏ వ్యతిరేక పార్టీల విస్తృత కూటమిని ఏర్పాటు చేయగలిగాడు. ఇందులో ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జనశక్తి, ఎన్సీపీ, సీపీఐ(ఎం) ఉన్నాయి. కాంగ్రెస్కు లాలూ నాలుగు సీట్లు మాత్రమే కేటాయించినందున, సంకీర్ణంపై సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం క్షీణించడాన్ని నాలుగు సీట్లు ప్రతిబింబిస్తున్నాయని ఇతర సంకీర్ణ భాగస్వాములు వాదించారు. దళిత వర్గాలలో బలమైన మద్దతు ఉన్న పార్టీ లోక్ జనశక్తికి ఎనిమిది స్థానాలు కేటాయించారు. ఎన్సీపీ, సీపీఐ(ఎం)లకు ఒక్కో సీటు కేటాయించారు. ఆర్జేడీ 26 స్థానాల్లో పోటీ చేసింది.
![]() | |||||||||||||||||||
| |||||||||||||||||||
40 సీట్లు | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 58.02% | ||||||||||||||||||
| |||||||||||||||||||
![]() |
రాష్ట్రంలో రెండు పెద్ద ఎన్డీఏ యేతర పార్టీలు, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, లాలూ నేతృత్వంలోని ఫ్రంట్లో చేరలేదు కానీ వ్యక్తిగతంగా పోటీ చేశాయి. సీపీఐ(ఎంఎల్) 21 స్థానాల్లో, సీపీఐ ఆరు స్థానాల్లో పోటీ చేసింది.
ఎన్డీఏ ఫ్రంట్లో బిజెపి, జెడి(యు) ఉన్నాయి. సీట్ల షేరింగ్ ఫార్ములాలపై భిన్నాభిప్రాయాలతో పొత్తుకు అనేక సందర్భాల్లో ముప్పు వచ్చింది. చివరకు జేడీ(యూ) 24 స్థానాల్లో, బీజేపీ 16 స్థానాల్లో పోటీ చేశాయి.
బీఎస్పీ మొత్తం 40 స్థానాల్లో, ఎస్పీ 32 స్థానాల్లో సొంతంగా పోటీ చేసి విఫలమయ్యాయి. లోక్ జనశక్తి దళిత ఓట్లపై, ఆర్జేడి యాదవ్ల ఓట్లపై పట్టు సాధించింది, తద్వారా ఉత్తరప్రదేశ్ ఆధారిత కుల పార్టీలు రాష్ట్రంలో పురోగతి సాధించలేకపోయాయి.
ఫలితంగా లాలూ నేతృత్వంలోని కూటమికి అఖండ విజయం లభించింది. 29 సీట్లు గెలుచుకుంది. మిగిలినవి బీజేపీ-జేడీ(యూ) కూటమికి వెళ్లాయి.
రాష్ట్రంలో ఓటింగ్లో అనేక అవకతవకలు జరగడంతో నాలుగు నియోజకవర్గాల్లో రీపోలింగ్కు ఆదేశించింది.