![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/Rajgruh%252C_the_residence_of_Babasaheb_Ambedkar_in_Dadar%252C_Mumbai.jpg/640px-Rajgruh%252C_the_residence_of_Babasaheb_Ambedkar_in_Dadar%252C_Mumbai.jpg&w=640&q=50)
బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం
బి.ఆర్ అంబేడ్కర్ స్మారక చిహ్నం, ఇల్లు / From Wikipedia, the free encyclopedia
బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం అనేది బి.ఆర్. అంబేద్కర్ స్మారక చిహ్నం, ఇల్లు. ముంబై నగరం, దాదర్లోని హిందూ కాలనీలో ఉన్న ఈ భవనానికి పురాతన బౌద్ధ రాజ్యాన్ని సూచిస్తూ రాజగృహ (ప్రస్తుతం రాజగిరి) అని పేరు పెట్టారు. మూడు అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో స్మారక చిహ్నంగా హెరిటేజ్ మ్యూజియం కూడా ఉంది.
![]() బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం | |
ప్రదేశం | హిందూ కాలనీ, దాదర్, ముంబై, మహారాష్ట్ర |
---|---|
రూపకర్త | బి.ఆర్. అంబేద్కర్ |
రకం | స్మారక భవనం |
నిర్మాణం ప్రారంభం | 1931 |
పూర్తయిన సంవత్సరం | 1933 |
అంకితం చేయబడినది | బి.ఆర్. అంబేద్కర్ |
భారతీయులకు, ముఖ్యంగా బౌద్ధులకు, దళితులకు పవిత్ర స్థలమిది. 15-20 సంవత్సరాలపాటు అంబేద్కర్ ఈ రాజగృహంలో నివసించారు.[1][2] డిసెంబరు 6న శివాజీ పార్క్లోని చైత్య భూమికి వెళ్ళేముందు లక్షలాదిమంది ప్రజలు ఈ గృహాన్ని సందర్శిస్తారు. అంబేద్కర్ రాజగృహంలో ఉన్న సమయంలో 50,000 కంటే ఎక్కువ పుస్తకాలను సేకరించారు, ఇది ఆయన మరణించే సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఒకటిగా నిలిచింది.[3][4] చట్టపరమైన, సాంకేతిక సమస్యల కారణంగా భవనాన్ని జాతీయ స్మారక చిహ్నంగా పేర్కొనే ప్రణాళికలు ఆపివేయబడ్డాయి, అయితే 2013లో ఈ భవనం వారసత్వ స్మారక చిహ్నంగా మారింది.[5][6]