బాణుడు
ఏడవ శతాబ్దపు రచయిత / From Wikipedia, the free encyclopedia
బాణభట్టుడు ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. యితడు నేటి బీహారు రాష్ట్రం ఛాప్రా జిల్లా ప్రీతికూట గ్రామంలో జన్మించాడు. ఇతడు హర్షవర్ధనుడు ఆస్థాన కవిగా గౌరవించబడ్డాడు. సా.శ.7 వ శతాబ్దములో నివసించాడు. కాదంబరి, హర్షచరిత్ర గ్రంథాలను రచించాడు. ఇవే కాకుండా చండికా శతకము, పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు. బాణోచ్ఛిష్టం జగత్సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు.
సంస్కృత కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం. పదమూడు శతాబ్దాలుగా వాఙ్మయ రచయితగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.