బాజీ రావు II
మరాఠాసామ్రాజ్యానికి 13వ (చివరి పీష్వా). / From Wikipedia, the free encyclopedia
పీష్వా బాజీ రావు II (1775 జనవరి 10- 1851 జనవరి 28) మరాఠా సామ్రాజ్యానికి 13వ (చివరి పీష్వా) గా పనిచేసాడు. అతను 1795 నుండి1818 వరకు పరిపాలించాడు. అతనిని మరాఠా ప్రభువుల వారి చెప్పుచేతలలో ఉండే ఒక తోలుబొమ్మ పాలకునిగా నియమించారు. అతనికి సంక్రమించిన, పెరుగుతున్న అధికారాలు, సైన్యం, అతని రాజధాని పూనా నుండి పారిపోవడానికి కారణమయ్యాయి. ఇది బ్రిటీష్ వారితో బస్సేన్ ఒప్పందం (1802)పై సంతకం చేయడానికి ప్రేరేపించింది. దీని ఫలితంగా రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-1805) జరిగింది. దీనిలో బ్రిటీష్ వారు విజయం సాధించి, అతనిని నామమాత్రపు పీష్వాగా తిరిగి నిలబెట్టారు.1817లో బాజీ రావ్ II ఆదాయ-భాగస్వామ్య వివాదంలో గైక్వాడ్ ప్రభువులకు అనుకూలంగా వ్యవహరించిన తరువాత, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో చేరాడు. అనేక యుద్ధ పరాజయాలను చవిచూసిన తరువాత, పీష్వా బాజీ రావు II బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. చివరకు ప్రతిఫలంగా బితూర్ వద్ద ఒక సంస్థానం, వార్షిక పించను చెల్లించే పద్దతిపై పదవీ విరమణ చేయడానికి అంగీకరించాడు.
బాజీ రావు II | |
మరాఠా సామ్రాజ్యం 13వ పీష్వా | |
పదవిలో 1796 డిసెంబరు 6 – 1818 జూన్ 3 | |
చక్రవర్తి | సతారాకు చెందిన షాహు II, ప్రతాప్ సింగ్, సతారా రాజు |
---|---|
మునుపు | మాధవరావు II |
తరువాత | స్థానం వాస్తవంగా అంతరించిపోయింది (నానా సాహిబ్ పీష్వాగా బిరుదు పొందాడు) |
జననం | (1775-01-10)1775 జనవరి 10 ధార్, మరాఠా సామ్రాజ్యం |
మరణం | 1851 జనవరి 28(1851-01-28) (వయసు 76) బితూర్ |
భార్య/భర్త | సరస్వతీ బాయి |
సంతానం | నానా సాహెబ్ (దత్తత తీసుకున్నాడు) |