From Wikipedia, the free encyclopedia
తెలుగు సినిమా నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.[1]. ప్రజా రాజ్యం లో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యింది[2]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రజా రాజ్యం పార్టీ | |
---|---|
వ్యవస్థాపన | చిరంజీవి |
స్థాపన | 2008 |
రద్దు | 2011 |
విలీనం | భారత జాతీయ కాంగ్రెస్ |
ప్రధాన కార్యాలయం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, |
సిద్ధాంతం | సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన |
వెబ్ సిటు | |
http://www.prajarajyam.org |
2008 ఆగస్టు 26 తేదిన తిరుపతిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలో చిరంజీవి పార్టీని అధికారికంగా ప్రారంభించాడు. సుమారు పది లక్షల మంది హాజరైన ఈ సభలో చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించాడు. పార్టీ పతాకంలో సుమారు మూడు వంతులు తెల్లని భాగం, దాని కింద ఒక భాగం పచ్చరంగు, మధ్యలో ఎర్రటి రంగులో సూర్యుడు, గుండ్రని భాగం చుట్టూ పసుపు బోర్డరు ఉన్నాయి.
2011 ఫిబ్రవరి 6 వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి రక్షణ శాఖా మంత్రి ఎ. కె. ఆంటోనీ ఈ విలీన ప్రతిపాదన తెచ్చాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.