పోర్బందర్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పోర్బందర్ జిల్లా (గుజరాతీ : પોરબંદર જિલ્લો) ఒకటి.పోర్బందర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లావైశాల్యం 2,298 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,86,062. వీరిలో 48.77% నగరప్రాంతాలలో నివసిస్తున్నారు.[1] జునాగఢ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి పోర్బందర్ జిల్లా రూపొందించబడింది. జిల్లా గుజరాత్ రాష్ట్ర ఖతియార్ ద్వీపకల్పం భూభాగంలో ఉంది.పోర్బందర్ ఉచ్ఛారణ (సహాయం·సమాచారం) భారత దేశము యొక్క గుజరాత్ రాష్ట్రములోని ఒక తీరప్రాంతపు పట్టణం. జాతిపిత మహాత్మా గాంధీ జన్మ స్థలము. ఇది పోర్బందర్ జిల్లా ముఖ్య పట్టణం.