పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు
From Wikipedia, the free encyclopedia
శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జైన ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘గుమ్మిలేరు జైన ఆలయం’ అని కూడా పిలుస్తారురు. పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ జైన ఆలయంలో మూలనాయకుడుగా (మూల విరాట్టు) 23 వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నెలకొని ఉన్నాడు.