పళముదిర్చోళై
From Wikipedia, the free encyclopedia
పళముదిర్చోళై (Palamuthircolai) తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 19 కిలోమీటర్ల దూరంలో కలదు . ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో (ఆరు పడై వీడు) ఈ క్షేత్రం మూడవదిగ చెబుతారు. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కొండపైన ఉంటుంది. కొండ క్రింద ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన “అళగర్ కోయిల్ ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి. కొండ క్రింద నుండి పైన సుబ్రహ్మణ్యుని ఆలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పై వరకు కార్లతో వెళ్ళవచ్చు. ఆలయం వాళ్ళు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు; ఉచితం కాదు .
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |