![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Parasurameswar_temple_with_linga.jpg/640px-Parasurameswar_temple_with_linga.jpg&w=640&q=50)
పరశురామేశ్వర ఆలయం
From Wikipedia, the free encyclopedia
పరశురామేశ్వర ఆలయం, ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్లో గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం సా.శ. 7, 8 ల మధ్య కాలంలోని సాయిలోద్భవ కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం సా.శ. 670 లలో నగర శైలిలో నిర్మితమైనదని నమ్మకం. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒడిషా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.
పరశురామేశ్వర ఆలయం | |
---|---|
![]() దేవాలయ గోపురం, ప్రార్థనా మందిరంతో కూడిన దేవాలయ చిత్రం | |
భౌగోళికాంశాలు: | 20°14′N 85°51′E |
స్థానం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఒడిషా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
ఎత్తు: | 12.27 మీ. (40 అ.) |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | పరశురామేశ్వర (శివుడు) |
ప్రధాన పండుగలు: | పరశురామాష్ఠమి |
పరశురామేశ్వర దేవాలయంలో "విమానం", "గర్భగుడి", "బాడ" ఉన్నాయి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉంది. ఈ శిఖరం 40.25 అ. (12.27 మీ.) ఎత్తు కలిగి ఉంది. ప్రాచీన దేవాలయాలలో ఒకేఒక విమానం కలిగి ఉన్న దేవాలయాలకన్న "జగన్మోహన" అనే అదనపు నిర్మాణము కలిగిన మొదటి దేవాలయం. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడినప్పటికీ, ఇది సక్తా దేవాలయాలలో భాగమైన సక్తా దేవతల శిల్పాలను కలిగి ఉంది. ఈ దేవాలయం భువనేశ్వర్ లో సప్తమాత్రికలైన చాముండ, వరాహి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, శివాని, బ్రహ్మి చిత్రాలను కలిగి ఉన్న మొదటి దేవాలయం. ఈ దేవాలయం ప్రస్తుతం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే (ASI) ద్వారా నిర్వహింపబడుతున్నది. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలలో పరాశురాష్ఠమి అనే ప్రధాన పండుగను ఈ దేవాలయంలో జరుపుతుంటారు.